
మాజీ మంత్రి హరీశ్ రావు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై మాజీ మంత్రి హరీష్ రావ్ స్పందించారు. ఇది తెలంగాణాపై కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుందని అభివర్ణించారు. దేశ ఆర్ధిక వృద్ధిలో కీలకంగా ఉన్న తెలంగాణాపై కేంద్రం ఈ బడ్జెట్ లో కూడా న్యాయం చేయలేదన్నారు.రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేకపోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగా చూపిస్తున్నట్లే అన్నారు.తెలంగాణకు ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఊసు లేదు. ఒక్క ప్రాజెక్టుకు ఆర్థిక సాయం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. .తెలంగాణ నుంచి బీజెపీ 8 మంది, కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.







Leave a Reply