ప్రభుత్వం చేతికి హెలి-బోర్న్ సర్వే నివేదిక

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం పనుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.సొరంగ నిర్మాణ పనులలో ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన వివరించారు.అర్దాంతరంగా నిలిచి పోయిన ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ కై చేపట్టిన హెలి-బోర్న్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని ఆయన చెప్పారు.శ్రీశైలం ఎడమగట్టు కాలువతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పధకంలో అంతర్భాగమైన మెడిగడ్డ, సుందిళ్ళ,అన్నారం బ్యారేజ్ ల పునరుద్ధరణ పనులపై ఆయన ఆదివారం సాయంత్రం నీటిపారుదల శాఖాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

సొరంగమార్గం పూర్తికి సర్వే ఆధారంగా రూపొందించిన నివేదిక దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రాజెక్టు నిర్వహణకై ప్రత్యేకంగా డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆపరేషన్ బృందానికి ప్రత్యేక చీఫ్ ఇంజనీర్ ను నియమించాలని ఆయన అధికారులను ఆదేశించారు.కాళేశ్వరం బ్యారేజ్ ల పనుల పునరుద్ధరణ పనులు వేగవంతంచేయడానికి అవసరమైన సాంకేతిక సంస్థలను,డిజైన్ కన్సల్టెంట్స్ సమన్వ్యయం ఆవశ్యకతను వివరించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించే పరీక్షల షెడ్యూల్ ,ప్రాజెక్ట డిజైనర్ల పనితో సమన్వయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.









Leave a Reply