పాక్ పై విజయం సాధించిన భారత్
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
అండర్ -19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత్ జట్టు పాక్ పై విజయం సాధించింది. భారీ స్కోరు సాధించకపోయినా పాక్ జట్టును నిలువరించడంలో భారత్ విజయవంతంగా అమలు చేసింది. 35 ఓవర్ల వరకు కూడా ఆసక్తిగా సాగిన మ్యాచ్ ఆ తరువాత అనూహ్యంగా భారత్ కు అనుకూలంగా మారింది. 35 ఓవర్ల నాటి పాక్ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. 4 వికెట్లు కోల్పోయి 166పరుగులు సాధించి పటిష్టంగానే కనిపించింది. పాక్ జట్టులో క్రీజ్ లో నిలదొక్కుకుని బ్యాటింగ్ చేసిన ఉస్మాన్ ఖాన్ 66పరుగులు చేసి అవుట్ కావడంతో…పాక్ పతనం మొదలైంది. భారత్ విజయానికి అడ్డుగా నిలదొక్కుకున్న ఉస్మాన్ ను భారత జట్టు కెప్టన్ ఆయూష్ మాత్రే ఔట్ చేయడంతో పాక్ పరాభవం వైపు వెళ్లక తప్పలేదు. ఆ తరువాత బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన పాక్ బ్యాటర్లు ఎక్కడా భారత బౌలింగ్ ను ఎదుర్కొంటూ నిలదొక్కుకోలేకపోయారు. 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులతో ఉన్న పాక్ జట్టు స్కోరు 194 పరుగులు సాధించే వరకు ఆలౌట్ అయింది.

బ్యాటింగ్ లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు కెప్టెన్ బౌలింగ్ లో 8 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన పాక్ జట్టు 3 వికెట్లు సాధించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఖిలాన్ పటేల్ 3 వికెట్లు తీసుకుని భారత్ విజయానికి బాటలు వేశారు. కీలక మ్యాచ్ లో పాక్ జట్టుపై భారత్ విజయం సాధించడంతో భారత్ సెమిఫైనల్స్ లో అడుగు పెట్టింది. అయితే పాక్ జట్టు సెమీ ఫైనల్ చేరేందుకు ఈ మ్యాచ్ లో 33.3 ఓవర్లలో సాధిస్తేనే సెమిఫైనల్స్ లో అడుగు పెట్టేది.. కానీ ఆ సమయానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత పాక్ విజయం సాధించినా ప్రయోజనం ఉండేది కాదు.. ఈ మ్యాచ్ లో పాక్ జట్టు బౌలర్లు అనుసరించిన విధానం సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ కు దారి తీసింది.









Leave a Reply