ప్రభుత్వం డైవర్షన్ గేమ్ కేటిఆర్

(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తోందని, ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ సిల్లీ అని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కొట్టి పారేశారు. గత వారం పది రోజుల వ్యవధిలోనే పార్టీ నేతల ను సిట్ విచారించిందని, అందరు నేతలను అడిగిందే అడుగుతోందని కేటిఆర్ అన్నారు. ఈ విచారణ చూస్తే తమను అడిగిన విషయాలే తమ పార్టీ అధినేత కేసిఆర్ ను అడిగి ఉంటారని నేను భావిస్తున్నానన్నారు. మేము అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి తప్పులు చేయలేదని, ప్రభుత్వం రాజకీయ కక్ష్య సాధింపుతో వ్యవహరిస్తోందన్నారు. కేసిఆర్ ను సిట్ విచారించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం లీకులతో నే నడిపిస్తోందని, ఇక్కడా ఎలాంటి తప్పు జరుగలేదని నేటి విచారణతో పోలీసు అధికారులకు కూడా తెలిసి పోయి ఉంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ ‘కాక్ అండ్ బుల్ స్టోరీ తయారు చేసి ఏదో జరిగిపోయిందని విచారణ చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ని ఈడీ (ED) విచారణకు పిలిస్తే మరి రాజ్భవన్ ముందు మీ ముఖ్యమంత్రి, మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారని కాంగ్రెస్ నేతలను కేటిఆర్ ప్రవ్నించారు. మేము కూడా మా నేతకు మద్దతుగా అందుకే ధర్నా చేశామన్నారు.


Leave a Reply