కాంగ్రెస్ గట్టిగా బుద్ధి చెప్పాలి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
రాష్ట్రంలో బీసీలను మోసం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పిన కాంగ్రెస్ అది అమలు చేయడంలో విఫలమైందన్నారు. బుధవారం కవిత మీడియాతో మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణ పాఠంచెప్పాలని పిలుపునిచ్చారు. బీసీ లకు న్యాయం చేయాలని జాగృతి ఆధ్వర్యంలో తాము పోరాటం చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన విధంగా రిజర్వేషన్లు అమలు చేసే వరకు తాము పోరాడుతామన్నారు. రిజర్వేషన్లు లేని చోట్ల బీసీలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు.గతంలో బీసీలకు రిజర్వేషన్ల డిమాండ్ తారాస్థాయికి చేరటంతో బీపీ మండల్ కమిటీ వేశారు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాని నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇప్పటికీ బీసీలు, మహిళలు, ఆదివాసీలకు అవకాశాలు రావటం లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభా గణన సక్రమంగా చేయలేదన్నారు.కొత్తగూడెం జిల్లాలో ఇప్పుడు కూడా ఒక్క పంచాయితీకి బసీ రిజర్వేషన్ దక్కలేదన్నారు.
ఆదిలాబాద్, అసిఫాబాద్ జిల్లాలో కూడా రిజర్వేషన్లు తగ్గాయని చెప్పారు.మొత్తం 12,735 గ్రామ పంచాయితీల్లో ఏజెన్సీ ప్రాంతాలను తీసేస్తే 10, 223 గ్రామ పంచాయితీలు ఉంటే 2 వేల 126 రిజర్వేషన్లు ఇస్తున్నారు. అంటే బీసీలకు 21.29 శాతమే అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్టీలు లేని ఐదు గ్రామ పంచాయతీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారన్నారు.


Leave a Reply