NewsInn

News in a Click

‘సిట్’ చీఫ్ ట్వీట్ బాధ్య‌తా రాహిత్యం

‘సిట్’ చీఫ్ ట్వీట్ బాధ్య‌తా రాహిత్యం

స‌జ్జ‌నార్ ట్వీట్ పై మాజీ మంత్రి హ‌రీష్ రావ్ సీరియ‌స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే న‌గ‌ర సీపీ స‌జ్జ‌నార్ చేసిన ట్వీట్ పై మాజీ మంత్రిహ‌రీష్ రావ్ సీరియ‌స్ అయ్యారు. ఆదివారం ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు ఐదు గంట‌ల పాటు మాజీ సీఎం కేసిఆర్ ను సిట్ విచారించింది. విచార‌ణ అనంత‌రం న‌గ‌ర సీపీ స‌జ్జ‌నార్ గ‌జ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్య‌మంత్రి కేసీ ఆర్ ను ఇల్లీగ‌ల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించామ‌ని ట్వీట్ చేశారు.

మంత్రిహ‌రీష్ రావ్ సీరియ‌స్ …….

పోలీసులు విచార‌ణ మాత్ర‌మే చేస్తారు కానీ తీర్పులు ఇవ్వ‌డానికి వారికి అధికారాలు ఉన్నాయా అని స‌జ్జ‌నార్ ను నిల‌దీశారు. పోలీసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఇల్లీగ‌ల్ అని ట్వీట్ చేశారంటే మీరు ముందుగానే నిర్ణ‌యానికి వ‌చ్చారా అని ప్ర‌శ్నించారు. మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు గౌర‌వం ఇవ్వ‌క‌పోడం స‌మంజ‌సం కాద‌న్నారు. ఖాకీ డ్రెస్ వేసుకొని రాజకీయ అజెండాలు అమలు చేయడం ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని మీకు తెలియదా అంటూ స‌జ్జ‌నార్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తీర్పులు కోర్టులు చెబుతాయ‌ని పోలీసులు కాద‌ని తేల్చిచెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోర్టు విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వకముందే, సిట్ చీఫ్ సజ్జనార్ గారు అధికారికంగా ‘ఇల్లీగల్’ అని ప్రకటించడం బాధ్యతరాహిత్యం అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 5(2), ఐటీ చట్టం, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జరిగిందా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుందని మీకు తెలియదా. ఇందులో ఏదైనా ఉల్లంఘన జరిగితే అది కోర్టు విచారణ ద్వారానే తేలాలి తప్ప, పోలీసుల అధికారిక ప్రకటనల ద్వారా కాదు. సజ్జనార్ గారు విడుదల చేసిన అధికారిక ప్రకటన (ట్విట్టర్లో) లో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనే పదాన్ని వాడటం చూస్తుంటే, దర్యాప్తు ఫలితంపై మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోందన్నారు.సిట్ చీఫ్ గారు మీరు విడుదల చేసిన అధికారిక ట్విట్టర్ ప్రకటనలో కనీసం కేసీఆర్ గారిని గౌరవ ప్రతిపక్ష నాయకులు అని సంబోధించడానికి కూడా ఇష్టపడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *