కవిత సెన్సేషనల్ కామెంట్స్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
బీఆర్ ఎస్ ఇంకా నియంతృత్వ విధానాలనే అవలంభిస్తుందని, రాచరిక పోకడలను వీడడం లేదని ఇలాగా వ్యవహరిస్తే ఆ పార్టీని ఎవరూ కాపాడలేదని మాజీ ఎంపీ కవిత ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన మాట్లాడిన కవిత బీఆర్ఎస్ పై మరోసారి విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ (గుంటనక్క) తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు.

అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చిందన్నారు. విచారణ కోసం ప్రభుత్వం ఎవరినైనా పిలువచ్చన్నారు. కేసిఆర్ ను విచారించేందుకు పిలిచినా కేటిఆర్ విచారణకు ఎందుకు పిలుస్తారని ప్రశ్నిస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసిఆర్ ను విచారణకు పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ ఆలోచించుకోవాలని కవిత సూచించారు. ఈ కేసులో ప్రభుత్వం హరీష్ రావ్ తో ఫిక్సింగ్ చేసుకుందని అందుకు కేసు విచారణ పూర్తవుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తెలంగాణా అస్తత్వం కేసిఆర్ సొంతమని ఆయనను ముడితే…తెలంగాణా అస్తిత్వాన్ని అవమాన పరిచే నట్లే అని వ్యాఖ్యానించారు. పెట్టుబడుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటున్న ఎంఓ యు లు కట్టు కథలుగానే ఉన్నాయ యన్నారు. ట్రంప్ కంపెనీ లక్ష కోట్ల రుపాయల పెట్టుబడి అంటూ ప్రభుత్వం చెప్పిందని దాని విలువే 30 వేల కోట్లుగా ఉందని కవిత వెల్లడించారు. అన్ని ఎంఓ యులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణాను మరోసారి మోసం చేసిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి తెలంగాణా జాగృతి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వారిని గెలిపించాలని కవిత కోరారు.
.



Leave a Reply