
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఎంఐఎం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పాశా ఖాద్రీ కొద్ది సేపటి క్రితం కన్ను మూశారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్న ఆయన ఈ రోజు సాయంత్రం మృతి చెందారు. 2004 నుంచి 2023 వరుకు ఆయన వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. చార్మినార్, యాకూత్ పురా నియోజకవర్గాల నుంచి శాసనసభ్యుడిగా ఆయన నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మొదటి సారి ఆయన లక్ష ఓట్లకు పైగా మెజార్టీ సాధించి శాసనసభలో అడుగు పెట్టారు. పాతబస్తీ లో పట్టున్న పార్టీ కావడంతో ఆయన నాలుగు సార్లు పాతబస్తీ లోని చార్మినార్ నుంచి రెండు సార్లు, యాకుత్ పురా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. గత రెండేళ్లుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. 2023 ఎన్నికల్లో ఆయన ఆనారోగ్య పరిస్థితుల కారణంగా పోటీ నుంచి తప్పుకున్నారు.







Leave a Reply