– మంత్రి సీతక్క

(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా ప్రభుత్వం మేడారం జాతరకు ముందునుంచి ఏర్పాట్లు చేయడంతో విజయవంతంగా నిర్వహించగలిగామని మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె కొంత మంది జాతర, నిర్వహణ పై విష ప్రచారం చేశారన్నారు. జాతర సందర్భంగా సమ్మక్క- సారాలమ్మలను దర్శించుకునేందుకు దాదాపు 2.50 కోట్ల మంది వచ్చినట్లు తాము అంచనా వేశామన్నారు. ఒక దొంగతనం ఘటనను తప్పుడు ప్రచారం చేశారని, ఎలాంటి తప్పిదాలు ఎక్కడా జరుగలేదన్నారు. ఒకటి రెండు రోజుల్లో తిరుగు జాతర మళ్లీ జరుగుతుందన్నారు. వచ్చే మేడారం జాతర నాటికి మేడారంను కలిపే దారులను పెద్ద ఎత్తున విస్తరించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ములుగు జిల్లాలో గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై త్వరలో సమీక్షలు మొదలు పెడుతామన్నారు.






Leave a Reply