NewsInn

News in a Click

ఆజీత్ ప‌వార్ మృతిపై రౌత్ అనుమానాలు

  • విచార‌ణ జ‌రుపాల్సిన అవ‌స‌రం ఉంది

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

ఇటీవ‌ల విమ‌న ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందిన మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజీత్ పవార్ మృతి పై శివ‌సేన ఉద్ద‌వ్ వ‌ర్గం నేత సంజ‌య్ రౌత్ అనుమానాలు వ్య‌క్తం చేశారు. కొద్ది రోజుల క్రిత‌మే ఇరిగేష‌న్ శాఖ‌లో జ‌రుగుతున్న కుంభ‌కోణాన్ని బ‌య‌ట‌పెడుతాన‌ని ప‌వార్ చెప్పిన కొద్ది రోజుల్లో ప్ర‌మాదంలో ఆయ‌న మృతి చెందడం అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు. బీజెపీ తో తెగ‌తెంపులు చేసుకుని తిరిగి ఎన్సీపీలో నే తిరిగి చేరేందుకు ఆజీత్ నిర్ణ‌యం తీసుకున్నార‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్నారు. ఇలాంటి ప‌రిణామాలు ప‌రిశీలిస్తే…. అజీత్ దాదా మ‌ర‌ణంపై ఉన్న అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. వెలుగులోకి వస్తున్న అంశాల‌పై విచా రణ జరపాల్సిన అవ‌స‌రం ఉంద‌నే అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. బీజెపి స్కాం ను బ‌య‌ట‌పెడుతాన‌ని జన వరి 15న కూడా బ‌య‌ట‌కు చెప్పిన విష‌యాన్ని రౌత్ గుర్తు చేశారు.ఇరిగేషన్ బడ్జెట్ ను ఎక్కువగా పెంచి ఆ నిధుల‌ను పార్టీ కి మళ్లించారని అజిత్ పవార్ చెప్పిన‌ట్లు త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. . అజిత్ పవార్ లాంటి ముఖ్య నేత ప్రయాణించే విమానంలో ఓఎస్ఓ సహా కీలకమైన వ్యక్తులు ఎవరూ లేరు. ఇంకా ఆ విమానానికి ఎలాంటి మెయింటేనెన్స్ సర్టిఫికెట్ లేదు. వీట‌న్నింటిపై స్ప‌ష్ట‌త రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సంజ‌య్ రౌత్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *