(అమరావతి,న్యూస్ఇన్)

గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీదర్ పై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై ఎమ్మెల్యే లైంగికంగా దాడి చేశారని బాధిత మహిళా జాతీయ మానవ హక్కు ల సంఘాన్ని ఆశ్రయించింది. మానవ హక్కుల సంఘం ఆదేశాలతో ఎమ్మెల్యేపై తిరుపతి పోలీసులు BNS 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జనసేన పార్టీ శాసనసభ్యుడు కావడంతో పార్టీ పరంగా ఎమ్మెల్యే వ్యవహారంపై విచారణ జరిపేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాన్ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. కమిటీ పూర్తి నిజానిజాలు నిర్ధారించిన తరువాత తీసుకునే చర్యల ఆధారంగా పార్టీ ఆయన పై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఏపీలో హాట్ హాట్ గా మారింది.







Leave a Reply