NewsInn

News in a Click

ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ ఘ‌ట్టం

ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ ఘ‌ట్టం

ప్ర‌చారంపై పార్టీల ఫోక‌స్

బ‌రిలో 12,993 మంది అభ్య‌ర్థులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

    రాష్ట్రంలో జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌వారం మ‌ధ్యామ్నం 3 గంట‌ల కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ముగిసింది. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజు నుంచే నామినేష‌న్లు స్వీక‌రించ‌డం మొద‌లు పెట్ట‌డంతో అన్ని రాజ‌కీయ పార్టీల‌తో పాటు స్వ‌తంత్రంగా పోటీ చేయ‌ల‌నుకున్న అభ్య‌ర్థులు పెద్ద ఎత్తు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. 19 వేల‌కు పైగా నామినేష‌న్లు దాఖ‌లు కాగా నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ నాటికి 12,993 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. ఒక్కో రాజ‌కీయ పార్టీ నుంచి టికెట్ ఆశించిన నేత‌లంతా నామినేష‌న్లు వేయ‌డం ఆ త‌రువాత చివ‌రి నిమిషంలో పార్టీలు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డంతో పెద్ద ఎత్తున నామినేష్లన్లు దాఖ‌లు అయ్యాయి. బుజ్జ‌గింపుల‌, ఒప్పందాల త‌రువాత 6,701 మంది అభ్య‌ర్థులు పోటీ నుంచి త‌ప్పుకునేందుకు ఆస‌క్తి చూపిస్తూ త‌మ నామినేష‌న్లు ఉప‌సంహరించుకున్నారు. వీరంతా ఇక ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న‌ట్లే ప‌లు చోట్ల అధికార పార్టీకి ఏక‌గ్రీవంగా కూడా వార్డు స్థానాలు ద‌క్కాయి. అతి త‌క్క‌వ సంఖ్య‌లో కాంగ్రెస్ పార్టీ ఏక‌గ్రీవంగా త‌మ కోటాలో స్థానాల‌ను వెయించుకోగ‌లిగింది.

    ప్ర‌చారంపై పార్టీల దృష్టి…..

    నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ కూడా పూర్తి కావ‌డంతో…. ప్ర‌ధాన పార్టీలు ఇక పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి సారించ‌నున్నాయి. ప్ర‌ధాన పార్టీల కీల‌క నేత‌లు కూడా ఎన్నిక‌ల ప్ర‌చారానికి సిద్ధం అవుతున్నారు. ప్ర‌చారం చేసుకునేందుకు కూడా అతి త‌క్కువ స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కేవ‌లం వారం రోజుల్లో ప్ర‌చారం పూర్తి చేయాల్సి ఉంది. 11వ తేదీ పోలింగ్ జ‌రుగ నుంది. దీంతో వారం రోజుల లోపే ప్ర‌చార వ్య‌వ‌ధి ఉంది.

    బీజేపీ త‌ర‌పున జాతీయ అధ్య‌క్షుడు….

    బీజెపి త‌ర‌పున ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ కూడా తెలంగాణా లో ప‌ర్య‌టించ‌నున్నారు. బుధ‌వారం ఆయ‌న పాల‌మూరు జిల్లాలో జ‌రిగే పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొంటారు. అనంత‌రం అక్క‌డ నిర్వ‌హించే బ‌హిరంస‌భ‌లో పాల్గొంటారు. జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌రువాత తొలిసారి తెలంగాణా ప‌ర్య‌ట‌న‌కు ఆయ‌న వ‌స్తుండడంతో పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మ‌డి మ‌హబూబ్ న‌గ‌ర్ తో పాటు పొరుగు జిల్లాల నుంచి పార్టీ క్యాడ‌ర్ ను ఆ స‌భ‌కు ర‌ప్పించేలా బీజేపీ ఏర్పాట్లు చేసింది.

    సీఎం రేవంత్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌….

    కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాలు, ఇంచార్జ్ జిల్లాల్లో విస్తృతంగా ప్ర‌చార‌న్ని మొద‌లు పెట్టారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా బుధ‌వారం నుంచి ప్రచారం మొద‌లు పెట్ట‌నున్నారు. బుధ‌వారం మిర్యాల గూడ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ త‌రువాత వ‌రుస‌గా ఐదు జిల్లాల్లో సీఎం ప‌ర్య‌ట‌న‌లు ఖ‌రారు అయిన‌ట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎక్క‌డ స‌భ‌లు నిర్వ‌హించాల‌న్న దానిపై ఇంకా ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే ఈ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని సీఎం జిల్లాల ప‌ర్య‌ట‌న కూడా మొద‌లు కానుంది.

    కేటిఆర్ ప్ర‌చారం ఉందా లేదా…..

    జాతీయ పార్టీలు ప్ర‌చార స‌మాయాన్ని స‌ద్వినియోగం చేసుకునే విధ‌గా ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తున్నాయి. అయితే తెలంగాణాలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న బీఆర్ ఎస్ ప్ర‌చార వ్యూహంపై ఇప్ప‌టికీ ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. పార్టీ అధినేత కేసిఆర్ దాదాపు ప్రచారం చేసే అవ‌కాశం లేదు. అయితే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప్ర‌చార స‌భ‌లు లేదా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వ‌హిస్తారా లేదా అన్న దానిపై పార్టీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అతి త‌క్క‌వ స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో బీఆర్ ఎస్ వ్యూహం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తి రేపుతోంది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *