NewsInn

News in a Click

కేఎల్ఎస్ఆర్ కుంభ‌కోణంపై కేంద్రం విచార‌ణ జ‌రుపాలి

దివాళా తీసిన కంపెనీకి రూ.6 వేల కోట్ల ప‌నులా : కేటిఆర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో కేఎల్ ఎస్ఆర్ అనే దివాళా తీసినా….కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఆ కంపెనీకి 6 వేల‌కోట్ల రుపాయల టెండ‌ర్లు సీఎం రేవంత్ రెడ్డి క‌ట్ట‌బెట్టార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు. ముఖ్య‌మంత్రి బినామి కంపెనీ కావ‌డంతోనే సీఎం ఆ కంపెనీకి పెద్ద ఎత్తున ప‌నులు అప్ప‌గించారన్నారు. గ‌తంలో కంపెనీలో ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో బ్యాంకు రుణాలు తీసుకుంద‌ని, ఇలాంటి కంపెనీకి ఇప్పుడు వేల కోట్ల ప‌నులు ద‌క్కాయో తేలాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ బినామీ కంపెనీ కేఎల్ ఎస్ ఆర్ కి సుప్రీం కోర్టు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నోటీసులు ఇచ్చింద‌ని వెల్ల‌డించారు. రేవంత్ రెడ్డి గతంలో తిరిగే ల్యాండ్ క్రూజర్ కారు (TS 07 FF 0009) కూడా ఈ కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రా పేరు మీదే రిజిస్టర్ అయి ఉందని కేటీఆర్ చెప్పారు.కె.ఎల్.ఎస్.ఆర్ కేసు వివాదంలో తీర్పును ప్రభావితం చేయాలని జడ్జి మీద ఒత్తిడి తేవడం సిగ్గుచేటన్నారు.సీఎం ప‌రోక్షంగా వ‌త్తిడి తేవడం వల్లనే జస్టిస్ శరత్ కుమార్ గారు విచారణ నుండి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ కంపెనీవివాదంలో ఎన్.సి.ఎల్.టి (NCLT) లో జడ్జి గారిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని, ఆర్థిక లావాదేవీలు నిలిపేయాలని చెప్పినా వీరు ఖాతాల్లో రూ. 150 కోట్లు మళ్ళించారని కేటిఆర్ఆరోపించారు. దివాళా తీసిన కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా క‌ట్ట‌బెట్టార‌ని జనవరి 23 నాడు సుప్రీంకోర్టు జనవరి 23 నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింద‌ని వెల్ల‌డించారు. ఈకంపెనీల‌పై సిబిఐ (CBI), ఈడీ (ED) లేదా ఎస్.ఎఫ్.ఐ.ఓ (SFIO) ద్వారా స్వతంత్ర విచారణ జరిపించాలని,సుప్రీంకోర్టు స్వయంగా సూచించింద‌ని కేటిఆర్ వెల్లడించారు….ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌కుండానే విచారణల పేరుతో సీఎం ట్యాపింగ్ డ్రామా నడిపించారని ఆరోపించారు.

బీఆర్ఎస్ డిమాండ్లు…

కె.ఎల్.ఎస్.ఆర్ (KLSR) కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలి

కంపెనీ నిర్వ‌హిస్తున్న ప‌నుల‌ను వెంట‌నే నిలిపి వేయాలి

సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే దాకా రాష్ట్రంలో కేఎల్ ఎస్ ఆర్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి

సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌చారం సిబిఐ (CBI), ఈడీ (ED) లేదా ఎస్.ఎఫ్.ఐ.ఓ (SFIO) వెంట‌నే విచార‌ణ జ‌రుపాలి

\సుప్రీం కోర్టు కేంద‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలకు నోటీసులు ఇచ్చింది.

రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ, ఈడీ, ఎస్.ఎఫ్.ఐ.ఓ రంగంలోకి దిగాలి.

ఈ కుంభకోణం మీద, కె.ఎల్.ఎస్.ఆర్ కుంభకోణం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *