NewsInn

News in a Click

జ‌గ్గారెడ్డి తో నే సంగారెడ్డి అభివృద్ధి

జ‌యా రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో యువ‌జ‌న కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కూత‌రు జ‌యారెడ్డి సంగారెడ్డి నియోక‌వ‌ర్గంలో జోరుగా చేస్తున్నారు. త‌న తండ్రి హాయంలో జ‌రిగిన అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులకు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు. సంగారెడ్డి, స‌దాశివ‌పేట మున్సిపాల్టీల్లో యువ నేత ప‌ర్య‌ట‌న ఆక‌ట్టుకుంటోంది. పేద ప్ర‌జ‌లు ఉండే ప్రాంతాల‌పై నే ఆమె ఎక్కువ‌గా ఫోక‌స్ చేసి ఆ ప్రాంతా ల్లోనే ఎక్కువ‌గా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు మున్సిపాల్టీలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను విజ‌యం సాధించేందుకు అనుగుణంగా జ‌గ్గారెడ్డి సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఆయ‌న త‌న‌యి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. గ‌తంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అభివృద్ధి, జ‌గ్గారెడ్డి చేసిన అభివృద్ధిని ప్ర‌జ‌లు బేరీజు వేసుకోవాల‌ని జ‌యారెడ్డి వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

నిరంత‌రం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం త‌న తండ్రి త‌పిస్తార‌ని… రెండు మున్సిపాల్టీలో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేస్తే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తామ‌ని జ‌యారెడ్డి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు అతి త‌క్కువ స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో….. రెండు మున్సిపాల్టీలో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేసేందుకు జ‌గ్గారెడ్డి కూడా చ‌క్రం తిప్పుతున్నారు. త‌న‌దైన స్టైల్లోనే ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేర‌వ‌వుతూ…. త‌న మార్క్ రాజ‌కీయం మొద‌లు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *