ఒక్కో వార్డుకు రూ. 8 కోట్లు
నేను పాలిచ్చే ఆవును….. కాపాడుకోండి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
(మెదక్,న్యూస్ఇన్)
మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం ముగిసేందుకు సమయం దగ్గర పడుతుండడతో నేతలు భారీగా హాలు ఇస్తున్నారు. మున్సిపాల్టీల్లో పాగా వేసేందుకు అధికారపార్టీ అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయిస్తామని చెప్పడం సహజం ….కానీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నియోజకవర్గంలోని మున్సిపాల్టీల ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన వార్డుల్లో ఒక్కో వార్డు అభివృద్ధికి 8 కోట్ల రుపాయాల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే వాళ్లు తనవద్దకు రారని, నేను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేకపోయినా…..అధికారపార్టీ నేతగా ఖచ్చితంగా పట్టణాల అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు చేస్తా అని చెప్పారు. తనకు సహాయం చేసే అలవాటును విపక్షాలు కట్టడిచేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.ఓ పేద మహిళకు సదాశివపేట లో ఆర్ధిక సహయంలో చేస్తే బీజేపీ, బీఆర్ఎస్ లుఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయన్నారు.తాను పాలిచ్చే ఆవు లాంటి వ్యక్తి నని చెప్పారు. తాను నిరంతరం పాలిస్తుంటే…..ఇతర పార్టీల నేతలు ఐదేళ్లకు ఒక్కసారి పాలిస్తారని చెప్పారు. మేత సరిగ్గా లేకపోతేనే అవులు పాలివ్వవని తన పరిస్థితి అంతే అనిచెప్పారు. తాను పాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా….. అవి తీసుకునే వారి అదృష్టంపైనే ఆధార పడి ఉంటాయని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 5 వేలకు మందికి పైగా ఇళ్ల పట్టాసర్టిఫికెట్లు ఇస్తే….. బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడికి ఎవరినీ రానివ్వలేదన్నారు. ఇప్పుడు కూడా ఇళ్లులేని వారికి ఇళ్ల పట్టాలు, ఇళ్లుంటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ చేయిస్తానని హామీ ఇచ్చారు.
నేను పోటీ చేయను….సేవ చేస్తా….
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేసేది లేదని తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డి పోటీచేస్తారని జగ్గారెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి నియోజకవర్గం మినహా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తానని చెప్పారు. ప్రజాసేవలో మాత్రం నిరంతరం ఉంటానన్నారు. తనశాయా శక్తుల ప్రజలకు సేవచేయడంలో ముందుంటానని ప్రకటించారు. పార్టీనేతలు కూడా తన సతీమణికే సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బియ్యం తక్కువ ఉన్నా తినేవాళ్ళు ఎక్కువగా ఉన్నట్లు ఉందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా మెల్లమెల్లగా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.







Leave a Reply