హైదరాబాద్,న్యూస్ ఇన్
తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ లో భాగంగా ఎక్స్పోలో విద్యుత్ శాఖ హరిత ఇంధనం ఉత్పత్తి పై ఏర్పాటుచేసిన నెట్ జీరో స్టాల్ కు ఆదరణ లభిస్తుంది.ఈ స్టాల్ లో విద్యుత్ వెహికల్, వేస్ట్ టు ఎనర్జీ, పవన విద్యుత్తు, పంప్డ్ స్టోరేజ్ పవర్ జనరేషన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ, సోలార్ ఫలకాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల నమూనాలను ఏర్పాటు చేశారు.

మంగళవారం, రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి గారు, పలువురు ప్రముఖులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు స్టాల్ ను సందర్శించి అక్కడ ప్రదర్శిస్తున్న నమూనాలను నిశితంగా పరిశీలించారు.విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల నమూనాలను ప్రదర్శించడం వలన ఈ స్టాల్ అత్యధిక సందర్శకులను ఆకర్షించింది. పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ పనితీరుకు సంబంధించి రియల్ టైం లో ప్రదర్శించడం పలువురిని కట్టిపడేసింది.పర్యావరణం, గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించడానికి నెట్ జీరో క్విజ్ సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు. పలువురు సందర్శకులు ఎంతో ఉత్సాహంగా ఈ క్విజ్ లో పాల్గొని నెట్ జీరో సర్టిఫికెట్ ను పొందారు. గర్వ ఒక ముఖ్యమంత్రి గారు మరియు డీజీపీ గారు కూడా ఎంతో ఉత్సాహంగా క్విజ్ లో పాల్గొన్నారు.





Leave a Reply