NewsInn

News in a Click

హ‌రీష్ రాజ‌కీయంతోనే 2023 ఎన్నిక‌ల్లో ఓట‌మి

హ‌రీష్ రాజ‌కీయంతోనే 2023 ఎన్నిక‌ల్లో ఓట‌మి
  • అది ఆయ‌న త‌ప్పు కాదు
  • ప్ర‌జ‌లు అర్ధం చేసుకోవాలి : జ‌గ్గారెడ్డి

(మెద‌క్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా…..తాను సంగారెడ్డిలో మాజీ మంత్రి హ‌రీష్ రావ్ రాజ‌కీయంతోనే ఓట‌మి చెందాల్సి వ‌చ్చింద‌ని టీపీసీ వ‌ర్కింగ్ జ‌గ్గారెడ్డి రీవీల్ చేసుకున్నారు. రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్తుల‌ను దెబ్బ‌తీసేందుకు స‌హ‌జ‌సంగా జ‌రిగే ప్ర‌క్రియ అని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.త‌న బ‌ల‌హీన‌త‌ల‌ను విశ్లేషించుకుని హ‌రీష్ రావ్ నియోక‌వ‌ర్గంలో చ‌క్రం తిప్ప‌డంతోనే తాను ఓట‌మి చెందాల్సి వ‌చ్చింద్నారు. ఎన్నిక‌ల‌కు ముందు మాజీ మంత్రి సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం సాధించేందుకు కోట్లాది రూపాయ‌లు వెచ్చించార్నారు.

హ‌రీష్ రావ్ కు న‌మ్మిన బంటుగా ఎమ్మెల్యే ఉన్నా…. గ‌త ప‌దేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ది ఎందుకు చేయ‌లేదన్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు స‌దాశివ పేట‌లో ఇచ్చిన ఇళ్ల ప‌ట్టాల‌కు భూమి కేటాయించ‌కుండా బీఆర్ ఎస్ అడ్డుకుంద‌న్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు అభివృద్ధిని అడ్డ‌కున్న బీఆర్ఎస్ నేత‌లు మ‌రోసారి ఓట్లు అడుతున్నార‌ని, ప్ర‌జ‌లు దీన్ని గుర్తించాల‌న్నారు. స‌దాశివ పేట‌కు చెందిన నేత ఎమ్మెల్యేగా ఉన్నా…ఇక్క‌డ ఎందుకు అభివృద్ధికి నోచుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంద‌ని, మ‌ళ్లీ ప్ర‌తిప‌క్షానికి ప‌ట్టం క‌డితే అభివృద్ధి చేయ‌డం అసాధ్య‌మ‌ని ప్ర‌క‌టించారు.

మున్సిపాల్టీలో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీకి క‌ట్ట‌బెట్టాల‌ని జ‌గ్గారెడ్డి కోరారు. దుర‌దృష్ట వ‌శాత్తు ఎవ‌రైనా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ఓట‌మి చెందితే వారు ప్రాతినిథ్యం వ‌హించే వార్డుల‌కు నిధులు కేటాయించే బాధ్య‌త కూడా త‌న‌పై ఉండ‌ద‌న్నారు. మ‌రో మూడేళ్ల కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉంటుంద‌ని, ఈ మూడేళ్లలో తాను గ‌తంలో ఇచ్చిన హామీల‌తో పాటు ఇప్పుడు ఇస్తున్న హామీలు అమ‌లు చేసే బాధ్య‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. ఈ ఎన్నిక‌ల్లో అయినా ప్ర‌జ‌లు అభివృద్ధికి ప‌ట్టం క‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.సదాశివ‌పేట‌లో కూడా ఒక్కో కాంగ్రెస్ అభ్య‌ర్థి వార్డుకు 8 కోట్ల రుపాయ‌లు అభివృద్ధికి కేటాయించే విధంగా తాను సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పిచ్చి తెస్తాన‌ని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *