-మంత్రి వేధింపులే కారణం అంటున్న బీజేపీ

(మహబూబ్ నగర్, న్యూస్ఇన్)
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మున్సిపాల్టీ పరిధిలో 6వ వార్డులో పోటీ చేస్తున్న బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఎరుకల మహదేవప్ప అనుమానాస్పద మృతి రాజకీయంగా కలకలం రేపుతోంది. పోలింగ్ కు ఒక రోజు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజుల క్రితం మంత్రి శ్రీహరి ఆధ్వర్యంలో మహాదేవప్ప కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత కొద్ది రోజులుగా అక్కడ ఇమడలేక రెండు రోజుల్లోనే తిరిగి సొంతగూటికే చేరుకున్నారు. అప్పటి నుంచి మంత్రి వేధింపులు ఎక్కువయ్యయాని మహాదేవప్ప కుటుంబ సభ్యులు ఆరోపించారు. బీజేపీ తరపున పోటీ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తుండడంతో మంత్రి వేధింపులకు పాల్పడ్డారని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారపై బీజేపీ కూడా సీరియస్ గా స్పందించింది. ఇది కాంగ్రెస్ చేసిన హత్యగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావ్ అరోపించారు. ఇది ఆత్మహత్యా, హత్యా అనే విషయంలో పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటనపై నిష్పాక్షింగా విచారణ జరిపించి బాధ్యులైన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాంచందర్ రావ్ మక్తల్ వెళ్లారు.







Leave a Reply