
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని సీఆర్ రావు ఇనిస్టిట్యూట్ లో 50 లక్షల విలువ చేసే ల్యాప్ టాప్ లు మాయం అయ్యాయి. క్లాస్ రూంలో ని ల్యాప్ టాప్ లు చోరీ చేసేందుకు కిటికి గ్రిల్ తొలగించి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించినట్లు పోటీసులు గుర్తించారు. ఈ ల్యాప్ టాప్ ను కారులో తరలించినట్లు సీసీ టీవిలో దృష్యాలు రికార్డు అయ్యాయి. ఆదివారం సెలువు దినం కావడంతో ఈ చోరీ శనివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం యదావిధిగా విధులకు హాజరైన సిబ్బంది దీన్ని గుర్తించడంతో కీటికీలు ఊడదీసి ఉండడం, కంప్యూటర్లు మాయం కావడంతో సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





Leave a Reply