భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సూచన

(న్యూఢిల్లీ, నూస్ఇన్)
శివారత్రికి ముందుగానే శ్రీశైలంలో అస్తవ్యస్థంగా పరిస్థితులు మారడం, పోలీసులు లాఠా చార్జ్ చేయడం వంటి పరిస్థితుల్లో ఒక్క సారిగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు, వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం లాఠీ చార్జ్ వరకు పరిస్థితులు దారి తీసాయి. ఈ ఘటలనపై ఏపీసీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. శ్రీశైలం సహా శివారాత్రి సందర్బంగా భక్తల రద్దీ, వసతుల పై ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా అదికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శివరాత్రి నాటికి శ్రీశైలంలో మరింత మంది భక్తులు పెరిగే అవకాశం ఉంటుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్దతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలన్నారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి లభించేలా కార్యచరణ అమలు చేయాలని ఆదేశించారు. లాఠీ చార్జ్ కు దారి తీసిన పరిస్థితులపై స్పందిస్తూ….దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులను అగౌరపరిచేలా ఎవరూ వ్యవహరించ కూడదని అదేశించారు.శివరాత్రి పర్వదినం వంటి సందర్భాల్లో అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు ముఖ్యమంత్రి ఆదేశం










Leave a Reply