ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారినని మోసాలు
రెండేళ్లుగా దందా
(హైద్రాబాద్,న్యూస్ఇన్)
షేక్పేట్లోని అపర్ణ ఔరా అపార్ట్మెంట్లో మకాం ఉంటూ ఘరానా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.ఓ భూమిని అలైన్మెంట్ చేయిస్తానని జిమ్ ఓనర్ దగ్గర రూ.10.50 లక్షలు.. జిమ్ వెళ్ళే మరో వ్యక్తి దగ్గర రూ.10 లక్షలు వసూలు చేసి తప్పించుకొని తిరుగుతున్న శశికాంత్ పని చేయించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వమంటే నేడు రేపు అంటూ వాయిదా వేస్తూ తన వ్యక్తిగత సిబ్బందితో బెదిరింపులకు దిగారు.మోసపోయామని గ్రహించి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జిమ్ ఓనర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో
పోలీసుĺi గంలోకిి గడంతో

విస్తు పోయే విషయాలు బయటకు వచ్చాయి. ఏపీ నందికొట్కూరుకు చెందిన శశికాంత్ అనే వ్యక్తి
తమిళనాడుకు చెందిన ఇద్దరు విశ్రాంత సీఆర్పీఎఫ్ జవాన్లను గన్మెన్లుగా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారని తేల్చారు.
చేతిలో వాకిటాకీలు, సైరన్ అమర్చిన కారు.. నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ ఐడీ కార్డులతో హల్చల్ చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసు విచారణలో
ఈ నకిలీ ఐఏఎస్ నాటకం గుట్టురట్టు అయింది. ఇదేవిధంగా మరికొంతమంది దగ్గర డిప్యూటీ కమిషనర్(మైన్స్), స్పెషల్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ శశికాంత్ పలువురు వ్యాపారుల వద్ద భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు శశికాంత్ను అరెస్ట్ చేసి, రెండు ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, వాకిటాకీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ కార్డులను స్వాధీనం చేసుకున్నారు



Leave a Reply