NewsInn

News in a Click

నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రికి ఎన్ని స్థానాలో….!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయ వేడి పుట్టించిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల కౌంటింగ్ ఆ నాలుగు మున్సిపాల్టీలో ఆస‌క్తి రేపుతున్నాయి.ఆ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫ‌లితాలు అంద‌రి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏ పార్టీ అభ్య‌ర్థులు చైర్మ‌న్ స్థానాలు చేజిక్కించుకుంటార‌న్న‌ది ఆస‌క్తి రేపుతోంది. అయితే ప‌లితాల ట్రెండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక‌త్య క‌నిపిస్తున్నా…. బీఆర్ ఎస్ కూడా మంచి ఫ‌లితాల‌ను సాధిస్తోంది. దీంతో ఎన్నిక‌ల ఫ‌లిఆతాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

కోడంగ‌ల్ లో….
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 3 మున్సిపాల్టీలు ఉన్నాయి. కోడంగ‌ల్, కోస్గి, మ‌ద్దూరు ఈ మూడు మున్సిపాల్టీల్లో వార్డు అభ్య‌ర్థుల‌ను ఏక‌గ్రీవంగా చేసుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ పావులు క‌దిపినా… అది సాధ్యం కాకుండా ముంద‌స్తు వ్యూహంతో గులాబీ పార్టీ అడ్డు క‌ట్ట వేయ‌గ‌లిగింది. కానీ పోలింగ్ జ‌రిగే నాటికి క్షేత్ర స్థాయి ప‌రిస్థితులు పూర్తిగా త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. బీఆర్ ఎస్ అభ్య‌ర్థులు కూడా ఈ మూడు మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు పోటీ ఇస్తున్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించినా మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా కోడంగ‌ల్ నేత‌ల‌తో అంత‌ర్గ‌త స‌మావేశాల‌తోనే స‌రిపెట్టి విజ‌యం కోసం వ్యూహాల‌ను అమ‌లు చేస్తూ వ‌చ్చారు.

గజ్వేల్ లో….

మాజీ సీఎం కేసిఆర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో దూకుడు ప్ర‌ద‌ర్శించింది. గ‌జ్వేల్ ప్ర‌చానికి మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ఆయ‌ను అడ్డుకోవ‌డం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ వంటేరు ప్ర‌తాప్ రెడ్డి బాధ్య‌త‌లు నిర్వ‌హించి స‌మ‌న్వయం చేస్తూ వ‌చ్చారు.

సిరిసిల్ల లో…
కేటిఆర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల మున్సిపాల్టీలో ఎవ‌రు పాగా వేస్తార‌న్న‌ది ఆస‌క్తి రేపుతోంది. సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్రాచార‌న్ని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మొద‌లు పెట్టారు. మున్సిపాల్టీలో కారును గెలిపించి త‌న ప‌ట్టును నిరూపించుకోవాల‌న్న ల‌క్ష్యంగా పావులు క‌దిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా బ‌ల‌మైన నేత ఉండ‌డంతో మున్సిప‌ల్ లో పాగా వేయాల‌న్న ల‌క్ష్యంగా కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గంలో పావులు క‌దిపింది. సీనియ‌ర్ నేత మ‌హేంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఇక్క‌డ కాంగ్రెస్ ఎన్నిక‌లు ఎదుర్కొంటున్నారు.

సిద్ద‌పేట‌లో….
ఇక ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని మ‌రో మున్సిపాల్టీ సిద్దిపేట మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ఇక్క‌డి నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌డంతో…ఈ మున్సిపాల్టీ ఎన్నిక‌లు కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. సిద్దిపేట‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ప‌ట్టున్న హ‌రీష్ రావ్ సిద్దిపేట‌లో బీఆర్ ఎస్ విజ‌యానికి పావులు క‌దుపుతూ…. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాల్లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సుడిగాలి ప్ర‌చారం నిర్వ‌హించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *