NewsInn

News in a Click

టీ-20 లో సంచ‌ల‌న‌లం-అసీస్ పై జింబాబ్వే విజ‌యం

టీ-20 లో సంచ‌ల‌న‌లం-అసీస్ పై జింబాబ్వే విజ‌యం

బ్యాటింగ్, బౌలింగ్ ల‌లో జింబాబ్వే ఆధిప‌త్యం

170 ప‌రుగులు చేయ‌లేక‌ పోయిన ఆసీస్

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌)

ప్ర‌పంచ ఛాంపియ‌న్ల‌కు ప‌రాభ‌వం ఎదురైంది. ఆస్ట్రేలియా పై 23 ప‌రుగుల తేడాతో జింబాబ్వే జ‌ట్టు విజ‌యం సాధించింది. టీ -20 ప్రపంచ కప్ లో ఈరోజు జరిగిన మ్యాచ్లో జింబాబ్వే అద్భుత పోరాటం కనబరిచింది. ప్రపంచ మేటి క్రికెట్ జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించింది. ఆస్ట్రేలియాను తొలి నుంచే అదుపులో పెట్టి విజయం కోసం శ్రమించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లను 169 ప‌రుగులు సాధించింది. జింబాబ్వే జ‌ట్టు బ్యాట్స్ మెన్ బ్రియాన్ బెన్నిట్ అత్య‌ధికంగా 56 బంతుల‌ను ఎదుర్కొని 64 ప‌రుగులు సాధించారు.

మిగిలిన బ్యాట్సెమెన్లు పూర్తిగా స‌హ‌క‌రించ‌డంతో జింబాబ్వే కేవ‌లం రెండు వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయింది.రియాన్ బూరే 35 ప‌రుగులు,టాడీవ‌న్షే 21 బంతుల్లో 35 ప‌రుగులు సాధించారు. సికింద‌ర్ ర‌జా 13 బంతుల‌ను ఎదుర్కొని 25 ప‌రుగులుసాధించి జ‌ట్టు స్కోరును 169 ప‌రుగుల‌కు చేర్చారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో సొయినిస్, కెమ‌రూన్ గ్రీన్ లో చెరొ వికెట్ పొందారు.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టుకు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. తొలి 5 ఓవర్లలోనే మూడు నాలుగు వికెట్లను ఆస్ట్రేలియా కోల్పోయింది. ఆస్ట్రేలియా జట్టును ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్, రైన్ షా లు ఆదుకున్నారు. నాలుగో వికెట్ భాగస్వామ్యానికి ఆచితూచి మంచి భాగ‌స్వామ్యాన్ని అందించారు. రెండో ఓవ‌ర్ లోనే జోష్ ఇంగ్లీష్ వికెట్ 3 వ ఓవ‌ర్ల‌లో కెమ‌రూన్ గ్రీన్ వికెట్ 3వ ఓవ‌ర్లో టీం డేవిడ్ వికెట్ల‌ను వ‌రుస‌గా కోల్పోయింది. కీల‌క బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ స్కోరు 29 ప‌రుగుల వ‌ద్ద ఐదో ఓవ‌ర్లో బౌల్డ్ అయ్యారు. దీంతో అస్ట్రేలియా 29 ప‌రుగుల‌కే ఐదు ఓవ‌ర్ల‌లో 4 కీల‌క వికెట్లు కోల్పోయింది.

మాక్స్ వెల్, రెన్ షాలు జ‌ట్టు స్కోరును ముందుకు తీసుకెళ్ల‌డంలో విజ‌య‌వంతం అయ్యారు. మ‌రో వికెట్ న‌ష్ట పోకుండ‌ద 14.2 ఓవ‌ర్ల‌లో 106 ప‌రుగ‌కుల‌కు స్కోరును చేర్చిన త‌రువాత మాక్స్ వెల్ ఔట్ అయ్యారు. రెన్ షా బ్యాటింగ్ చేస్తున్నంత సేపు కూడా అస్ట్రేలియా విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌నిపించింది. కానీ ఇత‌ర బ్యాట్సెమెన్ల నుంచి స‌హ‌కారం అంద‌క పోవ‌డంతో ఓట‌మిని ఎదుర్కోక త‌ప్ప‌లేదు. రెన్ సా 44 బంతులు ఎదుర్కొని 65 ప‌రుగులు సాధించి ఔట‌య్యారు. ఆ త‌రువాత వచ్చిన ఆస్ట్రేలియా బ్యాట్స‌మెన్లు స్టోయినిస్, డారిషిస్, జంపాలు పెద్ద‌గా క్రీజులో నిల‌దొక్కుకోలేక‌పోయారు.

చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో 30 కి పైరుగులు చేయాల్సిన ఆస్ట్రేలియా ప‌రుగులు సాధించే ప్ర‌త‌య్నంలో 19.3 ఓవ‌ర్ల‌లోనే ఆలౌట్ అయింది. జింబాబ్వే బౌల‌ర్ల‌లో మెజురుబ్బానీ 4 వికెట్లు, బ్రాడ్ ఎవ‌న్ 3 వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియా ప‌త‌నాన్ని శాసించారు.

భార‌త్ – పాక్ హై ఓల్టేజీ మ్యాచ్ పై..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *