NewsInn

News in a Click

హామీలు అమ‌లు చేయాల‌ని క‌విత మెరుపు ధ‌ర్నా

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు మ‌హిళ‌ల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని తెలంగాణా జాగృతి అధ్య‌క్షురాలు క‌విత మెరుపు ధ‌ర్నాకు పూనుకున్నారు. ప్ర‌జా భ‌వ‌న్ ముందు పెద్ద ఎత్తున తెలంగాణా జాగృతి నేత‌ల‌తో వ‌చ్చి ధ‌ర్నా చేయ‌డంతో పోలీసుల‌కు కొద్ది సేపు ఆర్ధం కాలేదు. ఆ త‌రువాత తేరుకున్న పోలీసులు ధ‌ర్నా చేస్తున్న మ‌హిళ‌ల‌ను అరెస్టు చేశారు.మ‌హిళ‌ల‌ను అరెస్టు చేస్తున్న దృష్యాల‌ను వీడియో తీస్తుండ‌గా జాగృతి కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌హిళ‌ల‌కు 18 ఏళ్లు పైబ‌డ్డ మ‌హిళ‌ల‌కు ఇచ్చిన రూ.2500 హామీని అమ‌లు చేయాల‌ని, అంగ‌న్ వాడిల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ప్రజా వాణి కార్య‌క్ర‌మంలో ఇచ్చేందుకు క‌విత స‌హా ప‌లువురు మ‌హిళా నేత‌లు అక్క‌డి చేర‌కున్నారు. ఆ త‌రువాత హామీలు అమ‌లు చేయాల‌ని ధ‌ర్నా చేయ‌డంతో పోలీసులు ఒక్క సారిగా షాక్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *