
మంత్రి నారా లోకేష్
(అమరావతి,న్యూస్ఇన్)
మంత్రి నారా లోకేష్ గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా సైన్యంగా ఏర్పడి నిధులు సమకూరుస్తున్నారు. పోస్టుల ద్వారా పునర్విక కుటుంబానికి నైతిక మద్దతు తెలుపుతున్నారు. SMA టైప్-1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక వ్యాధితో పోరాడుతోంది. చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ₹16 కోట్లు ఇంజక్షన్. అని వైద్యులు సూచించడంతో ఆ నిధుల సమకూర్చేందుకు ఆ పేద కుటుంబం వేడుకుంటుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన క్యాంపేయిన్ ను కూడా కొంత మంది నెటిజన్లు క్యాంపేయిన్ నిర్వహించారు. ప్రజల నుంచి కూడా భారీగా స్పందన దక్కింది. దాదాపు 10 కోట్ల రుపాయాలు పునర్విక వైద్యం కోసం విరాళాల రూపంలో అందాయి. ఇంకా కావాల్సిన ₹6 కోట్లు మంత్రి నారా లోకేష్ సమకూరుస్తామని ప్రకటించారు. పునర్విక పాప ఆరోగ్యం కోసం విరాళాలు ఇచ్చినవారు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినవారు, ప్రార్థించిన వారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పునర్విక తల్లిదండ్రులకు తనవంతు సహాయం ₹6 కోట్లు అందజేసి, చిన్నారి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు జరిగే చికిత్సకు సహకరించే చర్యలు తీసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించారు.



Leave a Reply