
తెలంగాణ సర్కార్ నజర్
(హైదరాబాద్,న్యస్ఇన్)
దేశంలో తొలిసారి జనగణన డిజిటల్ ఫార్మాట్లో చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో చేపట్టే డిజిటల్ విధానంలో పారదర్శకంగా జనగణ చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావ్ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ విడత స్వచ్ఛందంగా కూడా ఆన్ లైన్ ద్వారా ప్రజలు జనగణలో తమ వివరాలను సమర్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ వెల్లడించారు. జనగణనలో భాగంగా ఏ ఒక్క నివాసాన్ని కూడా వదలకుండా లెక్కించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

తెలంగాణ జనాభా గణన డైరెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుండి క్షేత్ర స్థాయి అధికారులు వ్యవహరించాల్సి తీరు గురించి వివరించారు. జనగణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా కూడా వివరాలు నమోఓదు చేసుకునే అవకాశాన్ని ఆమె తెలియచేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై భారతి హోళికేరి సమావేశంలో కలెక్టర్లకు సూచనలు చేశారు.



Leave a Reply