NewsInn

News in a Click

‘ప్ర‌జా పాల‌న‌’పై ప్ర‌జ‌ల్లోకి రేవంత్ స‌ర్కార్

‘ప్ర‌జా పాల‌న‌’పై ప్ర‌జ‌ల్లోకి రేవంత్ స‌ర్కార్
  • జిల్లా క‌లెక్ట‌ర్ ల‌కు సూచ‌న‌లు చేసిన సీఎం రేవంత్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అదికారం చేప‌ట్టి రెండేళ్లు పూర్తి కావ‌డంతో గ‌డిని రెండేళ్ల‌లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృధ్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించేందుకు 99 రోజుల కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌క‌టించింది. ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మాల‌పై సీఎం రేవంత్ రెడ్డి క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌ను సీఎం వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికారులు వ్య‌వ‌హ‌రించాల్సిన అంశాల‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఈకార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం చేయాల‌ని వారికి ఒక రోజు శిక్ష‌ణా శిబిరాన్ని నిర్వ‌హించి ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి వివ‌రాలు అంద‌చేయాల‌న్నారు. ప్ర‌జా పాల‌న‌- ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మంతో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా కార్య‌చర‌ణ‌ను సిద్ధం చేసింది.

అన్ని శాఖ‌ల అధికారులు ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌ను శాఖ‌ల వారిగా ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయాల‌న్నారు. ప్ర‌ధానంగా విద్యుత్ శాఖ అధికారులు సోలార్ విద్యుత్ వినియోగం పెంచేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అందులో భాగంగా వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు సోలార్ వినియోగించేలా రైతుల్లో అవగాహ‌న క‌ల్పించాల‌ని స‌\ఈఎం సూచించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన రేష‌న్ కార్డులు, స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌, రుణ‌మాఫీ, ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ ల‌బ్ధిదారుల వివ‌రాలు గ్రామ‌స‌భ‌ల్లో తెలియ‌జేయాలని ఆదేశించారు.అర్హుల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు.మ‌ధ్యాహ్న భోజ‌న ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెల్లించాలి. పిల్ల‌ల‌కు పోషకాహారం అందాలి. అందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌న్నారు.

మ‌త్తు ప‌దార్థాల‌పై సీరియ‌స్….

విద్యా సంస్థ‌ల్లో మ‌త్తు ప‌దార్థాల వినియోగాన్ని పూర్తిగా నివారించే విధంగా అధికారులు గ్రామ స్థాయి నుంచి దృష్టి సారించాల‌ని సీఎం అన్నారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో గంజాయి, డ్ర‌గ్స్‌, ఈ-సిగ‌రెట్ల వినియోగం జ‌రిగితే అందుకు ఆయా విద్యా సంస్థ‌ల యాజ‌మాన్యాలు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని సీఎం హెచ్చ‌రించారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠ‌శాల‌, క‌ళాశాల‌ల్లో స‌బ్జెక్ట్ టీచ‌ర్స్‌, పీఈటీ ఎలా ఉంటారో అలానే సైకాల‌జిస్ట్ ఉండేలా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వ్య‌వ‌సాయ శాఖ‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ప‌ర‌స్ప‌రం స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాలి. పంట‌లు వేసే మొద‌లు పంట ఉత్ప‌త్తుల అమ్మ‌కం వ‌ర‌కు స‌రైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ఉంటేనే ఇబ్బందులు ఎదురుకావు. ఈ విష‌యంలో ఈ రెండు శాఖ‌లు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగాలి. క‌లెక్ట‌ర్లు త‌మ త‌మ జిల్లాల్లో పంట‌ల వైవిధ్య‌త‌కు ఉన్న అవకాశాలపై నివేదిక స‌మ‌ర్పించాలి.

ఇదే స‌మ‌యంలో జ‌న‌గ‌ణ‌న‌ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో సీఎస్ ప్ర‌త్యేక సూచ‌న‌లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *