
- అధికారులకు సీఎం స్వీట్ వార్నింగ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ లకు క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా క్షేత్ర స్థాయిలో ప్రణాళికలను అమలు చేసే అధికారులుగా జిల్లా కలెక్టర్లు ఎంతో బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం త్వరలో మొదలు పెట్టనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సీఎం కలెక్టర్లు ఉన్నతాధికారులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఐఏఎస్ లు ఎంపికైనా…. ప్రజలకు ఉపయోగ పడే పనులు చేసినప్పుడే వృత్తి రీత్యా సార్ధకత లభిస్తుందన్నారు. ప్రభుత్వం అధికారుల పనితీరును ఎప్పుటి కప్పుడు బేరీజు వేస్తోందన్నారు. క్షేత్ర స్థాయిలో సమర్దవంతంగా పనిచేసిన అధికారులే కలెక్టర్లుగా, ఎస్పీలుగా కొనసాగుతారని స్పష్టం చేశారు. కనీసం నెలకు 10 రోజులు క్షేత్ర స్థాయిలో పనిచేస్తేనే కలెక్టర్లకు ప్రజా సమస్యలు తెలుస్తాయన్నారు.

జిల్లా కలెక్టర్లు కనీసం వారానికి ఒక రోజు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఇసుక మాఫియాకు అడ్డు అదుపులేకుండా పోతుందని, అక్రమ మైనింగ్ ను అరికట్టకపోతే జిల్లా అధికారులుగా కలెక్టర్, ఎస్పీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ ఆగకపోతే కలెక్టర్, ఎస్పీలను కూడా సస్పెండ్ చేయక తప్పదని సీఎం వార్నింగ్ ఇచ్చారు. పనితీరు ఆధారంగా అధికారులకు ప్రభుత్వం లో ప్రాధాన్యత దక్కుతుందని సీఎం స్పష్టం చేశారు.


Leave a Reply