ఆప్పుడు 6666…ఇప్పుడు 0009
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాలో ప్రభుత్వ పాలన ముఖ్యమంత్రుల లక్కీ నంబర్ల ఆధారంగా సాగుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత రెండు విడతలుగా అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ లక్కీ నంబర్ 6 కావడంతో గత ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేసినా…ఆరు తో ముడి పడి ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తూ వచ్చింది. పదేళ్ల కాలంలో ఆరు నెంబర్ అందరికీ లక్కీ నంబర్ అనే విధంగానే బీఆర్ ఎస్ నేతలు ఆ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు. గత రెండేళ్లుగా పూర్తిగా భిన్నంగా ఉండే 9 నంబర్ చుట్టూ పాలన నిర్ణయాలు అమలుకు నోచుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నంబర్ 9 కావడంతో ఆరు కు పూర్తిగా వ్యతిరేకంగా కనిపించే 9 నంబర్ మాదిరిగానే పాలనలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 6వ నంబర్ కు వ్యతిరేకంగా 9 వ నంబర్ ఉన్నట్లే నిర్ణయాలు కూడా ఉంటున్నాయి.రాష్ట్రంలో ఇప్పుడు 0009 ట్రెండ్ నడుస్తోంది.


నం.0009 పాలనలో కూడా అంతే వైరుధ్యం….
లక్కీ నంబర్ పాలన 2023లో ముగియడంతో ఇప్పుడు మరో నెంబర్ తెరపైకి వచ్చింది సరిగ్గా ఆరు కు వ్యతిరేకంగా ఉండే నంబర్ 9…. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్కీ నంబర్ 9 గా వ్యవహరిస్తారు. ఇక అదే తంతు కేసిఆర్ సమయంలో అధికారులు, పార్టీ నేతలు ఈ నంబర్ ను కలిసి వచ్చేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు అదే కొనసాగుతోంది. సీఎం గా రేవంత్ రెడ్డి తెలుపు రంగుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ఆయన వాహనాలు అన్నీ నలుపు రంగులోనే ఉంటాయి. దీంతో సీఎం కాన్వాయ్ నలుపురంగులోకి మారింది. ముఖ్యమంత్రి కాక ముందు వరకు 9 నంబంర్ లక్కీ నంబర్ గా తన వ్యక్తి గత వాహనాలకు వచ్చేలా రేవంత్ చూసుకున్నారు. సీఎం కావడంతో సహజంగా అదే లక్కీ నంబర్ 0009 ఆయన కాన్వాయ్ కు వాడుతున్నారు. ప్రస్తుతం అధికారులు సీఎంను ప్రసన్నం చేసుకునే విధంగా తమ కార్యాచరణను అమలు చేయడం మొదలు పెట్టారు. ఒకటి రెండు ఉదాహరణలు పరిశీలిస్తే…. ఇది స్పష్టంగా తెలిసిపోతుంది.తెలంగాణా రైజింగ్ పేరుతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ను డిసెంబర్ 9వ తేదీన భారీ పెట్టుబడులు వచ్చాయని ప్రకటించేందుకు ముగింపు తేదీని 9 వ తేదీ వచ్చేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసిఆర్ వ్యతిరేకంగా ఉండే నంబర్ 9 లక్కీ కావడంతో సచివాలయంలో 6వ ఫ్లోర్ నుంచి సీఎం కార్యాలయాన్ని 9వ ఫ్లోర్ కు మార్చుకున్నారు. అత్యవసరం అయితే తప్ప కేసిఆర్ ఛాంబర్ లోరేవంత్ ఉన్న సందర్భాలు అతి తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికను 99 రోజుల కార్యక్రమంగా ప్రభుత్వం ప్రకటించింది. సీఎం లక్కీ నంబర్ 9వ కలిసి వచ్చేలానే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది.


అప్పట్లో 6666వ నంబర్ హవా…
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం ఆరు నంబర్ కలిసి వచ్చే విధంగా నిర్ణయాలు అమలు చేయడం…. తన వాహనాలకు ఆరు నెంబర్ వచ్చే లా చూసుకోవడంతో దాదాపు పదేళ్ల పాటు రాష్ట్రంలో ఈ నంబర్ కు అత్యంత ప్రాధాన్యత దక్కింది. కేసిఆర్ ను ప్రసన్నం చేసుకోవలంటే ఆరు నెంబర్ వాడాల్సిందే అన్నంత చందంగా ఈ వ్యవహారం నేతల వరకు పాకింది. పార్టీ కీలక నేతలు కూడా తామ వాహనాల నంబర్ ను 6 వచ్చేలా తన ఫోన్ నంబర్ చివర్లో 6666 సంఖ్యలు ఉండేలా ట్రెండ్ కొనసాగింది. కేసిఆర్ స్వతహాగా దేవభక్తికి, సెంటిమెంట్లకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పార్టీ నేతలు కూడా అదే విధంగా వ్యవహరిస్తూ…అధినేతకు దగ్గరయ్యే విధంగా వ్యూహాలు అమలు చేశారు. కేసిఆర్ తన వ్యక్తిగత, అధికారిక కాన్వాయ్ నల్లరంగు కార్లు ఉండరాదన్న అభిప్రాయంతో కలర్ మార్చి నలుపు కార్ల స్థానంలో తెలుపు కార్లను ఆరు నంబర్ కలిసి వచ్చేలా నంబర్ ప్లేటులు ఏర్పాటు చేసి అధికారిక కాన్వాయ్ వాడారు. జిల్లల పునర్విభజన చేసినా రాష్ట్రంలో కేసిఆర్ తన లక్కీ నంబర్ కలిసి వచ్చేలా 33 జిల్లాలను ఏర్పాటు చేసారని విమర్శలు కూడా ఎదుర్కొనేఊ వరకు పరిస్థితి వెళ్లింది. సచివాలయ నిర్మాణం కూడా భారీ ఎత్తున చేపట్టిన మాజీ సీఎం కేసిఆర్…తన ఛాంబర్ ను 6వ ఫ్లోర్ లో ఏర్పాటు చేసుకున్నారు. 2023 లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసిఆర్ లక్కీ నంబర్ ఇప్పుడు అతి తక్కువ మందికి మాత్రమే పరిమితం అయింది.


ఈ నిర్ణయాలను పరిశీలిస్తే…. ముఖ్యమంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు అధికారులు ఇలాంటి ప్రణాళికలు అమలు చేస్తారా లేదంటే నేతల సూచలను మాత్రమే అధికారులు పాటిస్తారా అన్నది ఆసక్తి రేపే అంశం. వ్యక్తిగతంగా నేతలు సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావు… పాలనా పరంగా తమ లక్కీ నంబర్లను ప్రజలతో ముడిపెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే సీఎం కుర్చీపై ఎవరున్నా వారి అభిష్టాలకు అనుగుణంగానే పాలనలో మార్పులు అమలు అవుతాయన్నది తేటతేల్లం అవుతోంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కూడా పాలకుల నిర్ణయాలు ఉండాలన్నది మాత్రం ప్రజాభిప్రాయం.



Leave a Reply