NewsInn

News in a Click

ఇరుముడితో విమాన ప్ర‌యాణం

మంత్రి రామ్మోహ‌న్ నాయుడు

(అమ‌రావ‌తి, న్యూస్ఇన్ )

అయ్య‌ప్ప మాల ధార‌ణ చేసిన భ‌క్తులు విమానాల్లో శ‌బ‌రిమ‌లై వెళ్లేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని అయ్య‌ప్ప మాల ధార‌ణ చేసిన భ‌క్తుల‌కు స‌డ‌లింపులు ఇచ్చిన‌ట్లు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు వెల్ల‌డించారు. ఏయిర్ పోర్టుల్లో అయ్య‌ప్ప స్వాముల కోసం భ‌ద్ర‌తా ప్ర‌మాణాలను తాత్క‌లికంగా స‌వ‌రించ‌డం జ‌రిగింద‌న్నారు. గ‌త ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అయ్యప్ప స్వాములు త‌మ‌ ఇరుముడితో నేరుగా విమానాల్లో ప్ర‌యాణించేందుకు తాము ఆదేశాలు జారీ చేసిన‌ట్లు మంత్రి వివ‌రిస్తూ విడియో విడుద‌ల చేశారు. నేటి నుంచి జ‌న‌వ‌రి 20వ తేదీ వ‌ర‌కు ఈ సౌక‌ర్యాన్ని అయ్య‌ప్ప మాల ధార‌ణ చేసిన భ‌క్తులు వినియోగించుకోవ‌చ్చ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *