NewsInn

News in a Click

ఫైన‌ల్స్ కోసం భార‌త్-ఇంగ్లాండ్ ల కీల‌క పోరు

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్స్ కు ఇప్ప‌టికే న్యూజీలాండ్ జ‌ట్టు చేరుకోగా మ‌రో జట్టు నేడు తేల‌నుంది. రెండో సెమీఫైన‌ల్స్ భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య నేడు సాయంత్రం వాంఖేడే స్టేడియంలో కీల‌క పోరు జ‌రుగ‌నుంది. ఇందుకు కోసం ఇరు జ‌ట్లు ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేసి విజ‌యం కోసం ప‌రిత‌పిస్తున్నాయి. లీగ్ ద‌శ‌లో ఏక‌ప‌క్షంగా మ్యాచ్ ల‌ను పూర్తి చేసుకున్న భార‌త జ‌ట్టు ఆ త‌దుప‌రి ద‌శ‌లో ఫాం లేమితో స‌త‌మ‌త‌మ‌వుతూ వ‌చ్చింది. .త‌ప్ప‌కుండా గెలువాల్సిన మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించినా భార‌త జ‌ట్టు ఇంకా పూర్తి స్థాయిలో ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం లేదు. బ్యాటింగ్,బౌలింగ్, ఫీల్టిండ్ విభాగాల్లో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూనే ఉంంది. సెమీ ఫైన‌ల్స్ చేరుకునేందుకు ఇంగ్లాండ్ జ‌ట్టు లీగ్ ద‌శ‌లో ఇబ్బందులు ఎదుర్కొంది. ప‌సికూన‌ల్లాంటి జ‌ట్ల‌తో పోటీ ప‌డినా పూర్తి స్థాయిలో ప్ర‌ద‌ర్వ‌న ఇవ్వ‌లేక‌పోయింది. చివ‌రికి సెమీస్ చేరుకునే ద‌శ‌లో జ‌ట్టులో కీల‌క ఆట‌గాళ్లు ఫాం అందుకోవ‌డంతో ఇంగ్లాండ్ జ‌ట్టులో ధీమా క‌నిపిస్తోంది.

భార‌త ఆట‌గాళ్లు రాణిస్తే…..

భార‌త ఓపెనర్ల అట్ట‌ర్ ఫ్లాప్ ప్ర‌దర్శ‌న ఈ టౌర్న‌మెంట్ ప్రారంభం అయిన నాటి నుంచి కొన‌సాగుతోంది. అభిషేక్ శ‌ర్మ ఆరు మ్యాచ్ ల‌లో ఐదు సార్లు 0 ప‌రుగుల‌కే ఔట‌య్యారు. సంజు శాంస‌న్ లీగ్ ద‌శ‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయినా వెస్టీండీస్ మ్యాచ్ లో త‌ప్ప‌ని స‌రిగా గెలువాల్సిన సంద‌ర్బంలో ఫాంలోకి రావ‌డంతో జ‌ట్టు ఊపిరి పీల్చుకుంది. లీగ్ ద‌శ‌లో భార‌త బ్యాటింగ్ ఆర్డ‌ర్ చేసిన మార్పులు ఫ‌లిత‌ల‌ను ఇవ్వ‌లేదు….కానీ ఆ త‌రువాత సెమీస్ పోటీకి ముందు చేసిన బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్పులు ఫ‌లితాలు ఇచ్చాయి. ఓపెనింగ్ లో అభిషేక్, సంజులు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ త‌రువాత ఇషాన్ కిషాన్, సూర్య కుమార్, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్య‌, శివం దుబే, రింకూ సింగ్ ల వ‌ర‌కు బ్యాటింగ్ లైన‌ప్ భార‌త జ‌ట్టు క‌లిగి ఉంది. ఆయా స్థానాల్లో బ్యాటింగ్ కు వ‌చ్చి వేగంగా ప‌రుగులు రాబ‌ట్ట‌డంతో తిల‌క్ వ‌ర్మ గ‌త రెండుమ్యాచ్ ల‌లో విజ‌య‌వంతం అయ్యారు. శివం దుబేకు త‌క్కు వ‌ బంతులు ఎదుర్కొనే అవ‌కాశం వ‌స్తున్నా….ఆక‌ట్టుకునేలా బ్యాటింగ్ చేయ‌గ‌లుగుతున్నారు. బౌలింగ్ లో బూమ్రాతో పాటు ఆర్ష‌దీప్ ఫేస్ ద‌ళాన్ని న‌డిపించ‌నున్నారు. హ‌ర్దిక్ పాండ్య బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రాణించే స‌త్తా ఉన్న ఆల్ రౌండర్ స్పిన్న‌ర్లు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి లేదా కుల్దీప్ యాద‌వ్ ల‌లో ఒక‌రికి చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది. భార‌త స్పిన్న‌ర్లు ప‌ట్టు చిక్కితే ఇక ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్ మెన్ల‌కు నిల‌దొక్కుకోవ‌డం ఇబ్బందులు త‌ప్ప‌వు.ఇక ఇంగ్లాండ్ జ‌ట్టు విష‌యానికి వ‌స్తే ఆ జ‌ట్టు కెప్ట‌న్ హ్యారీ బ్రూక్ ఫాంలో ఉన్నారు. కొత్త‌గా జ‌ట్టులో చేరిన రెహాన్ అహ్మ‌ద్ జ‌ట్టు స్కోరు ను వేగంగా పెంచేలా బ్యాటింగ్ చేసే అవ‌కాశం ఉన్న ఆట‌గాడు. దీంతో ఫిల్ సాల్ట్, జోస్ బ‌ట్ల‌ర్, సాం క‌ర్ర‌న్, బెన్ డ‌కట్లాం, విల్ జాక్స్ లాంటి ఆట‌గాళ్లు ఇంగ్లాండ్ జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం క‌నిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ ల‌లో ఇరు జ‌ట్లు కూడా స‌మ ఉజ్జీలుగా క‌నిపిస్తున్నాయి.

భార‌త్ దే పై చేయి…..

భారత్, ఇంగ్లండ్‌కు వరుసగా మూడో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్. 2022లో భారత్‌ను ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో చిత్తు చేస్తే.. 2024 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 69 పరుగుల భారీ తేడాతో భారత్ ఇంటి ముఖం ప‌ట్టించింది. ఈ రెండు సందర్భాల్లో సెమీఫైనల్ గెలిచిన జట్లే టోర్నీ విజేతగా నిలిచాయి.
పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా 17-12తో ఇంగ్లండ్‌పై ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌తో ఆడిన గత 6 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ ఐదు గెలిచింది.

భార‌త్ కు క‌లిసి వ‌చ్చే వాంఖేడే…

వాంఖేడే స్టేడియంలో జ‌రిగే మ్యాచ్ ల‌లో భార‌త్ మెజార్టీ మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. ఈ పిచ్ బ్యాటింగ్ కు ఆనుకూలించే పిచ్ అని అంచ‌నా వేస్తున్నారు. బ్యాట్స్ మెన్ల‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్ పై ప‌రుగుల వ‌ర‌ద పార‌డం ఖాయం గా క‌నిపిస్తోంది.అయితే రెండో సారి బ్యాటింగ్ చేసే జ‌ట్టుపై మంచు ప్ర‌భావం క‌నిపించే అవ‌కాశం ఉంది. టాస్ గెలిచిన జ‌ట్టు బ్యాటింగ్ చేసే నిర్ణ‌యం తీసుకునే చాన్స్ ఉంది.

మ‌రో సెమీఫైన‌ల్స్ లో ద‌క్షిణాఫ్రికా చిత్తు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *