NewsInn

News in a Click

ఐసీసీ ఫైన‌ల్స్ – క‌ష్టాల్లో న్యూజీలాండ్

( స్పోర్ట్స్ డెస్క్ ,న్యూస్ఇన్‌)

256 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజీలాండ్ ఓపెన‌ర్లు దూకుడు చూపారు. అర్ష‌దీప్ వేసిన మొద‌టి ఓవ‌ర్ లోనే అలెన్ ఇచ్చిన సునాయ‌స క్యాచ్ ను శివం దుబె డ్రాప్ చేయ‌డంతో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు. 3వ ఓవ‌ర్ లో అక్ష‌ర్ ప‌టేల్ అలెన్ ను ఔట్ చేయ‌డంతో న్యూజీలాండ్ తొలి వికెట్ 31 ప‌రుగుల వ‌ద్ద కోల్పోయింది. డేంజ‌రస్ బ్యాట్సెమెన్ ఔట్ కావ‌డంత్ భార‌త్ ఊపిరి పీల్చుకుంది. ఆత‌రువాతి ఓవ‌ర్ వేసి జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ లో ర‌చిన్ ర‌వీంద్ర భారీ షాట్ కొట్టే క్ర‌మంలో న్యూజీలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. మ‌రో ఓపెన‌ర్ సీఫ‌ర్ట్, ఫిలిప్స్ లు ప‌రుగుల వేట‌లో ప‌డ్డారు. కానీ అక్ష‌ర్ ప‌టేల్ రెండో ఓవ‌ర్లో మ‌రో కీల‌క బ్యాట్స్ మెన్ ఫిలిప్ 5 ప‌రుగులు చేసి బౌల్డ్ అయ్యారు. దీంతో కీవిస్ 47 ప‌రుగ‌ల‌కే 3 వికెట్లు కోల్పోయింది. ప‌వ‌ర్ ప్లేలోనే న్యూజీలాండ్ 3 కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.సిఫెర్ట్, చాఫ్ మ‌న్ లు కొద్ది సేపు భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్న‌ట్లే క‌నిపించినా….. చాప్ మ‌న్ న్యూజీలాండ్ స్కోరు 74 ప‌రుగుల వ‌ద్ద హార్దిక్ పాండ్య బౌలింగ్ లో 8వ ఓవ‌ర్ లో బౌల్ట్ అయ్యారు. దీంతో కీవిస్ 4వ వికెట్ కోల్పోయింది. మ‌రో వైపు సీఫ‌ర్ట్ 23 బంతుల్లో 50 ప‌రుగులు పూర్తి చేసుకున్నారు. జోరుమీదున్న సీఫ‌ర్ట్ 9వ ఓవ‌ర్లో భారీ సాట్ ఆడ‌బోయారు…కానీ ఇషాన్ కిష‌న్ అధ్బ‌తంగా బంతిని అందుకోవ‌డంతో 52 ప‌రుగుల వ‌ద్ద సీఫ‌ర్ట్ ఔట‌య్య‌రు.

దీంతో న్యూజీలాండ్ ప‌రాజ‌యం వైపు అడుగులు ప‌డ‌డం ఖాయ‌మైంది. 72 ప‌రుగ‌ల‌కే 9 ఓవ‌ర్ల‌లో 5 కీల‌క వికెట్లు కోల్పోయింది.భార‌త బౌల‌ర్లపై న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్లు ప‌రుగులు సాధించే క్ర‌మంలో అటాక్ చేసినా….వారిపై వ‌త్తిడి పెంచ‌డంలో బౌల‌ర్లు విజ‌య‌వ‌తం అయ్యారు. బూమ్రా, హ‌ర్దిక్, వ‌రుణ్, అక్ష‌ర్ పటేల్ లు వ‌రుస‌గా న్యూజీలాండ్ బ్యాట‌ర్లను పెవీలియ‌న్ పంపారు. 10 ఓవర్లకు కీవిస్ 5 వికెట్లు కోల్పోయి 88 ప‌రుగులు చేసింది.

11వ ఓవ‌ర్ లో అర్ష‌దీప్ పై మిచెల్ సీరియ‌స్…

11 ఓవ‌ర్ వేసిన అర్ష‌దీప్ బౌలింగ్ లో మిచెల్ వ‌రుస‌గా సిక్స్ లు కొట్టి జోరు మీద ఉండ‌డంతో అర్ష‌దీప్ వేసిన ఓ బంతిని డిఫెన్స్ అడారు. బంతి తిరిగి అర్ష‌దీప్ వ‌ద్ద‌కు చేరుకోవ‌డంతో బంతిని అందుకున్న అర్ష‌దీప్ కీవిస్ బ్యాట్స్ మెన్ మిచెల్ పై విసిరారు. ప‌రుగు తీసే ప్ర‌య‌త్నంలో క్రీస్ బ‌య‌ట‌కు వ‌చ్చిన మిచెల్ ను ర‌నౌట్ చేసే ప్ర‌త‌య్నంలో అర్ధ‌దీప్ మిచెల్ పై బంతిని బ‌లంగా వేయ‌డంతో మిచెల్ సీరియ‌స్ అయ్యారు. అయితే అర్ష‌దీప్ దీన్ని ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్ల‌డంతో బ్యాట్స్ మెన్ అంపైర్ కు ఫిర్యాదు చేశారు. అయితే కెప్ట‌న్ సూర్య‌కుమార్ యాద‌వ్ మిచెల్ ద‌గ్గ‌ర‌కు వెల్లి స‌ర్ది చెప్ప‌డంతో స‌మ‌స్య స‌ద్దు మ‌ణిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *