
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్ర నూతన గవర్నర్ గా ఇటీవల నియామకం అయిన శివప్రతాప్ శుక్లా బుధవారం లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి అపరేష్ కుమార్ సింగ్ శుక్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రామకృష్ణా రావ్, డీజీపీ శివధర్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇప్పటి వరకు గవర్నర్ గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్ గా కేంద్రం నియమించింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శుక్లా విద్యార్థి దశ నుంచి ఏబివిపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. న్యాయ శాస్త్రంలో పట్టభద్రడైన శుక్లా 1983 లో బీజేపీలో చేరారు. గోరఖ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.యూపీ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా శుక్లాకు ఉంది.2023 లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన ఆయన ఇటీవల కొత్త గవర్నర్ల నియామకంలో తెలంగాణా గవర్నర్ గా కేంద్రం నియమించింది.

Leave a Reply