(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
భారత్లో క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదు. కోట్లాది మంది అభిమానుల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. అలాంటి క్రీడలో చిన్న వార్త కూడా పెద్ద చర్చకు దారి తీస్తుంది. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన ఒక అంశం సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి కారణమైంది. సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ పేరు పాకిస్తాన్ ఆటగాళ్ల కొనుగోలు వార్తలతో క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చ మొదలైంది.
సోషల్ మీడియాలో వెలుగులో విషయం వెలుగులోకి రావడంతో… విదేశీ టి20 లీగ్లలొ ఆడేందుకు ఎస్ ఆర్ హెచ్ పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేసిందని ఆ వార్తల సారంశం. కీలకమైన ఐపీఎల్ మ్యాచ్ లు దేశంలో ప్రారంభం అవుతుండడం…ఇదే సమయంలో విదేశీ జట్ల వేలంలో కావ్య పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం క్రికెట్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పించింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయం తీవ్ర వివాదంగా మారింది.

ఐపీఎల్కు పాక్ ఆటగాళ్లు దూరం….
2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్లో పాకిస్తాన్ ఆటగాళ్లకు పాల్గొనే అవకాశం దక్కింది. ఆతరువాత ఇరు దేశాల మధ్య మొదలైన ఉద్రిక్తతలతో ఐపీఎల్ లో పాక్ ఆటగాళ్లకు బీసీసీఐ అనుమతి ఇవ్డం లేదు. అప్పటి నుంచి ఐపీఎల్ కు పాక్ క్రికెటర్లు దూరంగానే ఉంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పలు టీ 20 లీగ్లు ప్రారంభమయ్యాయి. దక్షిణాఫ్రికా, యూఏఈ, అమెరికా, కరీబియన్ దీవుల్లో ఇలాంటి టౌర్నమెంట్లు మొదలయ్యాయి.
ఈ లీగ్లలో భారత వ్యాపార సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. ఒకే సంస్థకు వివిధ దేశాల్లో జట్లు ఉండటం ఇప్పుడు సాధారణ విషయం. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపికలో దేశ పరిమితులు చాలా సందర్భాల్లో ఉండవు. అందుకే కొన్ని విదేశీ లీగ్లలో పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు.
క్రీడా విశ్లేషకుల అభిప్రాయం…..
క్రీడా విశ్లేషకులు మాత్రం ఈ విషయాన్ని మరో కోణంలో చూస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ పూర్తిగా గ్లోబల్ వ్యాపారంగా మారిందని వారు అంటున్నారు. ఫ్రాంచైజీ లీగ్లలో ఆటగాళ్ల ఎంపిక ప్రధానంగా వారి ప్రతిభ మరియు మార్కెట్ విలువ ఆధారంగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న రాజకీయ పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ప్రభావం చూపుతాయని కూడా వారు అంగీకరిస్తున్నారు. అందుకే ఇలాంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు అభిమానుల్లో భావోద్వేగంగా స్పందించడం సహజమే అని అంటున్నారు.







Leave a Reply