NewsInn

News in a Click

పొలిటిక‌ల్ ‘పార్టీ’లు ‘డ్ర‌గ్స్’ చిక్కులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ డ్ర‌గ్స్ పార్టీ వ్య‌వ‌హారం ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఫాం హౌస్ లో ప‌ట్టుబ‌డిన వారిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ, బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దొరికి పోయారు. ఉత్త‌రాదికి చెందిన మ‌రో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప‌ట్టుబ‌డ్డారని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు.తెలుగురాష్ట్రాల్లో రాజ‌కీయంగా దూమారం రేపే అవ‌కాశం క‌నిపిస్తోంది.

రేప‌టి నుంచి ప్రారంభం కానున్నఅసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో మాజీ ఎమ్మెల్యై పైలెట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే న‌మీత్ శ‌ర్మ పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టు బ‌డ‌డం రాజకీయంగా హాట్ హాట్ గా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. అధికార పార్టీకి అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ఇది ఒక అస్త్రం చేతికి అందింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలోనే పార్టీ కీల‌క నేత‌ల‌పై ప్ర‌స్తుత సీఎం రేవంత్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించే వారు.

ఇర‌కాటంలో బీఆర్ఎస్……

తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్ర‌గ్ కేసులో ప‌ట్టుబ‌డ‌డంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.కాంగ్రెస్ పార్టీ నేత‌ల వ్యాఖ్య‌లు చూస్తుంటే ఇది స్ప‌ష్టంగా తెలిసి పోతుంది. బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ ప‌ట్టుబ‌డ్డా ఈ డ్ర‌గ్ రాకెట్ వెనుక ఎవ‌రున్నారో కూడా తేలుస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో దీన్ని దాచి పెట్టినా…ఇప్పుడు మేము అన్నింటిని బ‌య‌ట‌కు తెస్తామ‌ని తాండూరు ఎమ్మెల్యే మ‌నోహ‌ర్ రెడ్డి అంటున్నారు. దీంతో బీఆర్ ఎస్ పార్టీలో ఈ కేసు ఇంకెవ‌రి మెడ‌కు చుట్టుకుంటుందో అన్న అనుమానాలు మొద‌లౌతున్నాయి. ప‌దేళ్ల పాటు రాష్ట్రంలో బీఆర్ ఎస్ పాలన‌లో డ్ర‌గ్స్ రాష్ట్ర వ్యాప్తంగా విస్త‌రించాయ‌ని ఆరోపించారు. ఆ పార్టీ కీల‌క నేత‌ల ప్ర‌మేయంతోనే ఈ ప‌రిస్థితి దాపురించింద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే స‌హా కాంగ్రెస్ నేత‌లు ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తుండ‌డంతో….ఈ కేసు రాజ‌కీయంగా ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో అన్న ఆందోళ‌న గులాబీ నేత‌ల్లో మొద‌లైంది. అధికార పార్టీగా గ‌తంలో వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టినా…. ప్ర‌స్తుతం కాంగ్రెస్ నేత‌లు చేసే ఆరోప‌ణ‌లును గులాబీ పార్టీ ఎలా ఎదుర్కొంటుంద‌న్న‌ది ఆస‌క్తి రేపుతోంది. పొలిటిక‌ల్ గా త‌మ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని స‌మ‌ర్ధిస్తుందా….త‌మ‌కు సంబంధం లేద‌ని ఆయ‌న వ్య‌క్తి గ‌తం అంటూ త‌ప్పించుకుంటుందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

వైసీపీ టార్గెట్ లో టీడీపీ……

తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మ‌హేష్ కూడా ప‌ట్టు బ‌డ‌డంతో ఏపీలో తెలుగుదేశం పార్టీకి చిక్కులు మొద‌లౌతున్నాయి. ఓ మాజీ మంత్రి త‌న‌యుడు ఇటీవ‌లే డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ్డార‌ని, ఇప్పుడు స్వ‌యంగా ఎంపీ ప‌ట్టు బ‌డ‌డంతో ఈ వివాదం తెలుగుదేశం పార్టీని చుట్టుముడుతోంది. వైసీపీ నేత‌లు తెలుగురాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను టార్గెట్ చేస్తూ ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భావితం చేయ‌క‌పోతే….ఈకేసులో పుట్టామ‌హేష్ ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

పుట్టా మ‌హేష్ కు ఎంపీగా కొన‌సాగే అర్హ‌త లేద‌ని, వెంట‌నే స‌స్పండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. పాజిటివ్ గా నిర్ధార‌ణ అయితే చంద్ర‌బాబు కూడా పార్టీ ప‌రంగా పుట్టా మ‌హేష్ వ్య‌వ‌హారంలో ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది. ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే విషయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద‌గా చ‌ర్చ‌కు రాక‌పోయినా…రాజ‌కీయంగా మాత్రం చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *