NewsInn

News in a Click

ఎట్ట‌కేల‌కు ‘రైతు బంధు’కు ముహూర్తం ఫిక్స్

ఎట్ట‌కేల‌కు ‘రైతు బంధు’కు ముహూర్తం ఫిక్స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రైతు బంధు ప‌థ‌కానికి నిధులు మంజూరు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రైతు భ‌రోసాను అమ‌లు చేస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం రెండు విడ‌తలుగా గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ట్లే రైతుల‌కు ఎక‌రాకు ఆరు వేల చొప్పున మంజూరు చేసింది. కాంగ్రెస్ ఎన్నిక‌ల‌కు ముందు ఇస్తామ‌న్న ఎక‌రాకు రూ.7,500 ఇవ్వ‌డం ఇప్ప‌టి వ‌ర‌కు కూడా అమ‌లు చేయ‌డం లేదు. గ‌త ప్ర‌భుత్వం ఏటా రెండు విడ‌త‌లుగా రైతు బంధును ఖ‌చ్చితంగా అమ‌లు చేస్తూ వ‌చ్చింది. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రెండు విడ‌త‌లుగా ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు ఆర్ధిక స‌హాయం చేసింది. మూడో విడ‌త కింద ఈ నెల 22వ తేదీ నుంచి నిధులు విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. దాదాపు రెండున్న‌రేళ్ల పాల‌న‌లో 3వ సారి రైతుల‌కు ఈ ప‌థ‌కం కింద ఆర్ధిక స‌హాయం అంద‌నుంది. రెండు విడ‌తల్లో కూడా ఒక విడ‌త 2023 ఎన్నిక‌ల‌కు ముందు బీఆర్ ఎస్ స‌ర్కార్ ఎన్నిక‌ల కోడ్ తో నిలిపివేయ‌డంతో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఆ నిధుల‌ను విడుద‌ల చేసింది.

ఇప్పుడు విడుద‌ల చేసే నిదులు కూడా రైతు బంధు ప‌థ‌కంలో భాగంగా అమ‌లు చేసిన‌ట్లు ఎక‌రాకు 6 వేల రుపాయ‌ల‌ను ఇస్తారా…లేదా కాంగ్రెస పార్టీ ఎన్నిక‌ల హామీలో ఇచ్చిన విధంగా 7.500 ఇస్తారా అన్న‌ది మాత్రం స్ప‌ష్ట‌త లేదు. అయితే రైతు బంధు అని ప్ర‌క‌టించ‌డంతో ఎక‌రాకు ఆరు వేల రుపాయాలు మాత్ర‌మే అందే అవ‌కాశం మాత్రం ఉంది. ఈ నెల 22 వ తేదీ నుంచి ఈ ప‌థ‌కాన్ని మొద‌లు పెట్టి రాబోయే 20 రోజుల్లో రైతుల ఖాతాల్లో జ‌మ‌చేయాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టాదారు పాసు బుక్క‌ల ఆధారంగా ఎలాంటి సీలింగ్ లేకుండా రైతు బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది….కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారికంగా సీలింగ్ విధించిన‌ట్లు ప్ర‌క‌టించక‌పోయినా చిన్న‌, స‌న్న‌కారు రైతుల‌కే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డం మొద‌లు పెట్టింది. పెద్ద రైతుల‌కు ఈ ప‌థ‌కం కింద ఆర్ధిక స‌హాయం అంద‌డం లేదు.

22వ తేదీ మొద‌టి విడ‌త నిదులు విడుద‌ల‌…..

ఈ నెల 22వ తేదీన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా న‌ర్మెట్ట ఆయిల్ ఫాం ప‌రిశ్ర‌మ‌ను ప్రారంభించేందుకు వెళుతున్నారు. ఈ సంద‌ర్భంగానే రైతు బంధు నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. త‌లి విడ‌త‌గా 3,500 కోట్ల రుపాయాల‌ను విడుద‌ల చేస్తూ 70 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. రెండో విడ‌త‌లో 2,650 కోట్ల రుపాయాలు, 3 వ విడ‌త ద్వారా మొత్తం నిధులు మంజూరు చేసి రైతుల ఖాతాల్లో జ‌మ‌చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఐదెక‌రాల లోపు రైతుల‌కు ఈ ప‌థ‌కం అమ‌లు చేసినా దాదాపు 90 శాతానికి పైగా రైతుల‌కు ఆర్ధిక స‌హాయం అంద‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *