NewsInn

News in a Click

నేను త‌ప్పు చేయ‌లేదు- పుట్టా మ‌హేష్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

హైద‌రాబాద్ డ్ర‌గ్ కేసులో ప‌ట్టుబ‌డి స్టేష‌న్ బేయిల్ పై విడుద‌ల అయిన పుట్టా మ‌హేష్ యాద‌వ్ ఈ కేసుకు సంబంధించి ఓ వీడియోను విడుద‌ల చేశారు. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని ఆయ‌న వీడియో లో చెప్పారు. ఎన్నో రోజులుగా డిన్న‌ర్ కు ఆహ్వానిస్తే ఆ ఫాం హౌస్ కు వెళ్లిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చెప్పారు. తెలిసిన వాళ్లు కావ‌డం, చాలా రోజుల త‌రువాత స‌మ‌యం దొర‌క‌డంతోనే తాను ఫాం హౌస్ లో డిన్న‌రకు హాజ‌రైన‌ట్లు చెప్పారు. ఒక్క నిమిషంలోపు నిడివి ఉన్న వీడియో పుట్టా మ‌హేష్ మ‌రే అంశాన్ని ప్ర‌స్తావించ లేదు. కేవ‌లం త‌ప్పు చేయ‌లేదు ఎలూరు ప్ర‌జ‌ల‌కు స‌మాచారం తెలియ చేయాల‌ని తాను వీడియో విడుద‌ల చేస్తున్న‌ట్లు చెప్పారు. మీడియాలో, సోష‌ల్ మీడియాలో వ‌చ్చే క‌థ‌నాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని పుట్టా మ‌హేష్ కోరారు.

పుట్టా మ‌హేష్ తో పాటు మ‌రో ఇద్ద‌రు బేయిల్ పై విడుద‌ల కావ‌డంతో… పైలెట్ బ్ర‌ద‌ర్స్ స‌హా మిగిలిన వారిని రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో మెజిస్ట్రేట్ ముందు పోలీసులు ప్ర‌వేశ పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *