
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ నగరంలో ధారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల పాపకు చాకోలేట్ ఆశ చూపి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. నార్సింగ్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. బాలిక నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్ లో తల్లి తండ్రులు ఫిర్యాదు చేశారు. మిస్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. బాలిక తప్పి పోయిన ప్రాంతం నుంచి సీసీటీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్తుతున్న దృష్యాలను పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని బాలిక గురించి ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆ వ్యక్తి అంగీకరించి బాలిక మృత దేహం ఉన్న ప్రదేశాన్ని పోలీసులకు చూపించారు.







Leave a Reply