(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫాం డ్రగ్స్ కేసులో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈకేసులో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటింది. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకుంది. ఐసీఎస్ అధికారి యోగేష్ గౌతం నేతృత్వంలో సిట్ ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఫాం హౌస్ పై శనివారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించడం అక్కడ జరిగిణ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంఆ సంచలన రేపాయి. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా మరో 9 మందిని పోలీసులు ఫాం హౌస్ లో అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను రిమాండ్ చేసిన పోలీసులు మిగిలిన వారిని బేయిల్ పై విడుదల చేశారు. 11 మందిలో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షలతో నిర్ధారణ అయింది.

అయితే ఈ కేసులో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయన్న దానిపై సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. ఫాం హౌస్ లో పట్టబడ్డ వారు సిమ్లాకు బిజినెస్ టూర్ కు వెళ్లిన సమయంలో డ్రగ్స్ తెచ్చినట్లు రవి కౌషిక్ సమాచారం ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. కానీ దీని వెనుక ఉన్న రాకెట్ పై తెలంగాణా సర్కార్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా ఈగల్ టీం లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పార్టీతో పాటు డ్రగ్ మూలాలను వెతికే పనిలో ఇక సిట్ పని చేయనుంది. సిట్ సమగ్ర దర్యాప్తు తరువాత మరిన్న వివరాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది.
డ్రగ్స్ పార్టీలు…నేతల చిక్కులు







Leave a Reply