
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాబోయే బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా, రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్బంగా భట్టి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకు పెద్ద పీఠ వేసేలా నిధులు కేటాయించే అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చినట్లయింది.ఆర్ధిక పరమైన అంశాలలో ఇబ్బందులు పడుతున్న సర్కార్…. హామీల అమలుకు కేటాయింపులు మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

గాంధీభవన్లో జరిగిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ‘పరాభవ’ నామ సంవత్సరంలో దుష్టశక్తులకు పరాభవం కలగాలని, రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా విలసిల్లాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని అన్ని రంగాలు దిగ్విజయంగా వృద్ధి చెందాలని, ముఖ్యంగా తెలంగాణ యువతకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభించాలని ఆశించారు. ప్రతి కుటుంబం ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరుతూ, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన పార్టీ శ్రేణులను అభినందించారు.
ఉగాది ఉత్సవాల్లో సీఏం రేవంత్ రెడ్డి ఏమన్నారు…..
,









Leave a Reply