NewsInn

News in a Click

ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై హై కోర్టుకు బీఆర్ఎస్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ త‌ర‌పున విజ‌యం సాధించి… కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేపై కొద్ది రోజుల క్రితం స్పీక‌ర్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు పార్టీ మారిన‌ట్లు ఎక్క‌డా ఆధారాలు లేవ‌ని ప్ర‌క‌టించారు. దీంతో స్పీక‌ర్ నిర్ణ‌యంపై బీఆర్ ఎస్ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ మారిన ప‌ది మంది శాస‌న‌స‌భ్యుల‌పై స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని బీఆర్ ఎస్ హై కోర్టులో స‌వాల్ చేసింది. తొలి విడ‌తలో 7 గురు ఎమ్మెల్యేల‌పై హై కోర్టును ఆశ్ర‌యించింది. మ‌రో ముగ్గురు శాస‌న‌స‌బ్యుల‌పై కూడా కోర్టుకు వెళ్ల‌నుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలో దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు లపై తొలి విడ‌త‌లో పిటిషన్ దాఖ‌లు చేశారు. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హై కోర్టు ఈ ఎమ్మెల్యేల‌ను ఆదేశించింది. కేఉ విచార‌ణ‌ను వ‌చ్చే 16వ తేదీకి వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *