(హైదరాబాద్, న్యూస్ ఇన్)
కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
తనను సర్పంచ్ గా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని ఓ కార్యకర్త ఆత్మహత్యా యత్నం చేశారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లోనే ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. తనను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయొద్దని కాంగ్రెస్ నాయకులు చిత్రహింసలకు గురి చేశారని మనస్తాపంతో పురుగుల మందు తాగి శ్రీపురం గ్రామం సర్పంచ్ అభ్యర్థి ఓర్సు బంగారయ్య ఆత్మహత్యాయత్నం చేశారు.గత
35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని.. కాంగ్రెస్ నాయకులే తనను చిత్రహింసలకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యకం చేశారు. ఆత్మహత్యా యత్నం చేసిన వ్యక్తని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు.



Leave a Reply