NewsInn

News in a Click

ఆర్సీబీ మ్యాచ్ – ఏక‌పక్షంగా మార్చిన సూర్య‌వంశీ

ఆర్సీబీ మ్యాచ్ – ఏక‌పక్షంగా మార్చిన సూర్య‌వంశీ

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌)

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌పు ముక్కు, యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోసారి త‌న బ్యాట్ తో త‌డ‌ఖా చూపించారు. ప్ర‌పంచంలో అగ్ర శ్రేణి బౌల‌ర్ల‌ను ఎదుర్కొంటూ మ‌రో సారి ఆర్సీబీ బౌల‌ర్ల‌పై వీర‌విహారం చేశారు. ఆర్టీసీ టార్గెట్ 202 ప‌రుగుల‌ను చేదించేందుకు రంగంలోకి దిగిన ఆర్ ఆర్ జ‌ట్టు ప‌వ‌ర్ ప్లేలోనే భారీగా ప‌రుగులు పిండుకుంది. జ‌ట్టు ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్, వైభ‌వ్ సూర్య‌వంశీలు ఈ టౌర్న‌మెంట్ లోనే అత్యుత్త‌మ భాగ‌స్వామ్యాలు అందించారు. ఈమ్యాచ్ లో కూడా జోరు మీద క‌నిపించిన ఓపెన‌ర్లు త్వ‌ర‌లోనే వికెట్ కోల్పోయారు. తొలి వికెట్ ను య‌శ‌స్వీ జైస్వాల్ రూపంలో రాజస్థాన్ రాయ‌ల్స్ 21 ప‌రుగుల వ‌ద్ద కోల్పోయింది. మ‌రో ఎండ్ లో ఉన్న వైభ‌వ్ ఏమాత్రం అదురు బెదురు లేకుండా హేజీల్ ఉండ్, భువ‌నేశ్వ‌ర్ కుమార్ ల‌ను ప‌వ‌ర్ ప్లేలోనే ఫోర్లు, సిక్స్ లు కొడుతూ స్కోరు ప‌రుగులు పెట్టించారు.

వైభ‌వ్ కు తోడుగా ధృవ్ జురేల్ కూడా విరుచుకు ప‌డ‌డంతో…9 ఓవ‌ర్ వ‌ర‌కే 129 ప‌రుగుల వ‌ద్ద‌కు రాయ‌ల్స్ స్కోరు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 26 బంతులు ఎదుర్కొన్న వైభ‌వ్ 8 ఫోర్లు, 7 సిక్స్ ల‌తో 78 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. ఆ త‌రువాత జురేల్ త‌న వైభ‌వ్ మాదిరిగానే స్కోరును నెమ్మ‌దించ‌కుండా చూశారు. వైభ‌వ్ స్థానంలో బ్యాటింగ్ వ‌చ్చిన హెట్మియ‌ర్ వెంట‌నే ఔట్ అయి పెవిలియ‌న్ చేరుకున్నారు. రియ‌న్ ప‌రాగ్ కూడా పెద్ద స్కోరు చేయ‌కుండా నే 134 ప‌రుగ‌ల స్కోరు వ‌ద్ద 9.4 ఓవ‌ర్ల ద‌గ్గ‌ర ఔట‌య్యారు. సూర్య‌వంశీ ఎఫెక్ట్ తో హెజీల్ ఉడ్ 4 ఓవ‌ర్ల‌లోనే 44 ప‌రుగులు, భువి 3 ఓవ‌ర్ల‌లో 3 ప‌రుగులు స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింది. ధృవ్ జురేల్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్ ల‌తో 81 ప‌రుగులు చేసి ఆర్.ఆర్ జ‌ట్టును విజ‌యం వైపు న‌డిపించారు.ర‌వీంద్ర జ‌డేజా 18 ఓవ‌ర్లలో 202 ప‌రుగులు చేసి ఆర్సీబీపై విజ‌యం ద‌క్కించుకుంది.

అంత‌కు ముందు బ్యాటింగ్ చేసి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు జ‌ట్టు త‌డ‌బ‌డుతూ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవ‌డంతో క‌ష్టాల్లో ప‌డింది. 80 ప‌రుగుల లోపే ఐధ‌/ కీల‌క‌ వికెట్లు కోల్పోయింది. ప‌రుగ‌ల ఖాతా మొద‌లు పెట్ట‌క‌ముందే ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ ఔటయ్యారు. ఆ త‌రువాత బాట‌ర్లు కూడా వెంట వెంట‌నే పెవిలిన‌య‌న్ చేరుకున్నారు. విరాట్ కోహ్లీ 16 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల‌తో 32 ప‌రుగులు చేశారు. క‌ష్టాల్లో ఉన్న ఆర్సీబీని ర‌జ‌త్ పాటిదార్ 40 బంతుల్లో 63 ప‌రుగులను 4 ఫోర్లు, 4 సిక్స్ ల స‌హాయంతో చేశారు. చివ‌ర్లో వెంక‌టేశ్ అయ్య‌ర్ మెరుపుల‌తో ఆర్సీబీ గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరుకు చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *