(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఐపీఎల్ లో అభిషేక్ శర్మ మరోసారి తన విశ్వరూపం చూపారు. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు పవర్ ప్లేలోనే భారీగా పరుగులు పిండుకున్నారు. పోటీ పడుతూ హిట్టింగ్ చేశారు. ఫోర్లు, సిక్స్ లతో తొలి ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ పై ఆధిపత్యం మొదలు పెట్టారు. ఎస్ ఆర్ హెచ్ బ్యాటర్లను ఆడ్డుకునేందుకు పంజాబ్ చెమటోడాల్సి వచ్చింది. ఓపెనింగ్ బ్యాటింగ్ భాగస్వామ్యం చూస్తే….. జట్టు స్కోరు 300 పరుగులకు చేరుకునే అవకాశం ఉందనిపించింది.

తొలివికెట్ భాగస్వామ్యానికి అభిషెక్, హెడ్ లో 8 ఓవర్లలో 120 పరుగులు జోడించారు. అభిషేక్ 28 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 8 సిక్స్ ల సహాయంతో 74 పరుగులు చేశారు. ఇదే సమయంలో ట్రావిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో 38 పరుగులు చేశారు. 8.1 ఓవర్ల వద్ద హెడ్ ఔటయ్యారు. ఆతరువాత కొద్ది సేపటికే అభిషేక్ కూడా పెవిలియన్ చేరుకున్నారు. ఓపెనర్లు వెనుదిరిగిన తరువాత ఎస్ ఆర్ హెచ్ స్కోరు మందగించింది. ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరు ఔట్ కావడంతో ఎస్ ఆర్ హెచ్ పై స్వల్పంగా వత్తిడి పెరిగింది. ఇషాన్ కిషన్,క్లాసిన్ లు ఇన్నింగ్స్ స్కోరు పెంచే ప్రయత్నాల్లో పడ్డారు. భారీ షాట్లు ఆడిన ఇషాన్ కిషన్ మరింత వేగంగా పరుగులు చేయాలన్న లక్ష్యంగా బ్యాటింగ్ చేసి 17 బాల్స్ ఎదుర్కొని ఒక సిక్స్ 3 ఫోర్ల సహాయంలో 27 పరుగులు చేసి ఔటయ్యారు. అనికేత్ వర్మ, క్లాసిన్ లు మరో వికెట్ కోల్పోకుండా స్కోరు ను నిదానంగా పెంచుతూ వచ్చారు. అనికేత్ వర్మ16.4 ఓవర్ల వద్ద 18 పరుగులు చేసి సమన్వయ లోపంతో రనౌట్ అయ్యారు. 18వ ఓవర్లో రెండు వందల పరుగుల స్కోరు దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ ఆర్ హెచ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి 220 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ముందు ఉంచింది.








Leave a Reply