(హైదరాబాద్,న్యూస్ఇన్)
ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడాన్ని తమను క్షమించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ధాన్యం సేకరణపై చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు కేటాయించిన ప్రైవేటు గోదామును పరిశీలించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ తీరును తప్పు పట్టడం విశేషం. నల్గొండ జిల్లాకే చెందిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలులో పెంచుతున్నట్లు చివరికింజ ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన రెండు రోజులకే రాజగోపాల్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి మంత్రులు, ముఖ్యమంత్రి చెబుతున్నదంతా తప్పని తేల్చేశారు. రైతులు కష్టాలు పడుతున్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూ… మేం కూడా ఈ పరిస్థితులపై చింతించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం దిగుబడి కూడా భారీగా పెరగడం ఒక కారణమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలను రాజకీయంగా కాకుండా…. వాస్తవానికి దగ్గరగా చూడాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వం గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇస్తున్నా…. ఆచరణలో అది సాధ్యం కాకపోవడం ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేని ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చినట్లు అవుతుంది.










Leave a Reply