(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
ఈ రోజు జరిగిన రెండు మ్యాచ్ లలో ఏక పక్షంగానే జరిగాయి. తొలి మ్యాచ్ లో SRH పై PBKS భారీ స్కోరును మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి విజయం దక్కించుకుంది. మరో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన CSK జట్టుDC కి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా విజయం దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేసింది.
సంజుశాంసన్ తన టీ-20 ల్లో తన ఫాం కొనసాగిస్తున్నారు. శాంసన్ మరోసారి బ్యాటింగ్ తో జట్టు స్కోరును భారీగా మలిచారు. ఓపెనర్లుగా శాంసన్, రుజురాజ్ గైక్వాడ్ లు సీ ఎస్ కే ఇన్నింగ్స్ మొదలు పెట్టి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్ భాగస్వామ్యం కోసం 6,2 ఓవర్లలో 62 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ నిదానంగానే మొదలైనా సగం ఓవర్లు పూర్తయ్యే సరికి రన్ రేట్ సగటు 10కి చేరుకుంది. గైక్వాడ్ 18 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తో 15 పరుగులు సాధించి 62 పరుగుల వద్ద 7వ ఓవర్లో ఔటయ్యారు.

ఆ తరువాత సంజు శాంసన్, ఆయుష్ మాత్రేలు సీఎస్ కే స్కోరును ఏడా పెడా బాదుతూ పెంచుతూ వచ్చారు. ఏ దశలోనూ చెన్నై బౌలర్లు ఈ ఇద్దరిపై ప్రభావం చూపలేకపోయారు. సంజు శాంసన్ ప్రపంచకప్ తరువాత మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడారు. 52 బంతులు ఎదుర్కొని 102 పరుగులు సెంచరీ సాధించారు. ఈ సీజన్ లో తొలి సెంచరీ నమోదు చేశారు.ఐపీ ఎల్ లో నాలుగు సెంచరీలు చేసి అగ్రశేణి బ్యాటర్ల సరసన సంజు చేరారు.
మరో వైపు యువ సంచలనం మాత్రే జోరును కొనసాగిస్తూ జట్టు స్కోరును పెంచారు. 36 బంతులు ఎదుర్కొని 59 పరుగులు చేశారు. కానీ జట్టు యాజమాన్యం నిర్ణయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగారు. మాత్రే స్థానంలో శివందుబే బ్యాటింగ్లో సంజుతో జత కట్టారు. స్కోరు పెంచాలన్న లక్ష్యంగా సీఎస్కే ఈ నిర్ణయం తీసుకుంది. 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఈ స్కోరులో సంజు 56 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 4 సిక్స్ ల సహాయంలో 115 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. శివం దుబే 10 బాల్స్ ఆడి 20 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

ఢిల్లీ క్యాపిటల్స్ 213 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగింది. డీసీ ఓపెనర్లు పవర్ ప్లే లో భారీగానే పరు పాగులు రాబట్టారు. తొలి ఐదు ఓవర్లలోనే స్కోరును 60 పరుగులు దాటించారు. పాతుం నిసాంక 24 బంతులు ఎదుర్కొని 41 పరుగులు సాధించారు. దీంట్లో 5 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. లోకేష్ రాహూల్ కూడా భారీ స్కోరును ఛేదించాలన్న లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. 10 బంతులు ఎదుర్కొని 18 పరుగులు సాధించారు. దీంట్లో 2 ఫోర్లు, సిక్స్ ఉంది. 5వ ఓవర్ చివరి బంతికి లోకేష్ రాహూల్ వికెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ రూపంలో కోల్పోయింది. అదే స్కోరు వద్ద నిసాంక కూడా వెనుదిరిగారు. 61 పరుగల వద్ద వెంట వెంటనే రెండు వికెట్లు డీసీ కోల్పోయింది. దీంతో సీ ఎస్ కే జట్టులో జోష్ పెరిగింది.క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీలు స్కోరు పెంచే క్రమంలో ఇద్దరు ఔటయ్యారు. అక్షర్ ఒకే పరుగు చేసి వెనుదిరగగా, సమీర్ 9 బాల్స్ ఎదుర్కొని ఇబ్బందులు పడుతూ ఆరు పరుగులు చేసి పెవిలీయన్ చేరుకున్నారు. దీంతో 8 ఓవర్లలోపే 76 పరుగులు సాధించి నాలుగు వికెట్లు డీసీ కోల్పోయింది. డేవిడ్ మిల్లర్, స్టబ్స్ లు జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. వీరి భాగస్వామ్యంతో13 వ ఓవర్ వరకు 121 పరుగులకు స్కోరు చేరుకున్న సమయంలో మిల్లర్ 17 పరుగులు చేసి ఔటయ్యారు.
–మరో మ్యాచ్ లో SRH పై PBKS విజయం….
మరో వైపు స్టబ్స్ క్రీజులో కొనసాగుతుండడంతో ఢిల్లీ గెలుపు ఆశలు సజీవంగానే ఉన్నాయి. మిల్లర్ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన అశుతోష్ శర్మ రెండు సిక్స్ లు బాది దూకుడుగా కనిపించినా ఆ వెంటనే ఔట్ కావడంతో డీసీ15 ఓవర్ లోనే 149 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పయింది. అసుతోష్ 10 బంతుల్లో 2 సిక్స్ లు 1 ఫోర్ తో 19 పరుగులు చేసి వెనుదిరిగారు. జట్టు సాధించాల్సిన రన్ రేట్ క్రమంగా పెరుగుతుండడంతో డీసీ బ్యాటర్లపై వత్తిడి పెరుగుతూ వచ్చింది. చైన్నై బౌలర్లు వరుసగా డీసీ వికెట్లు తీయడంతో డీసీ కోలుకోవడం అంతా సలువుగా కనిపించలేదు. జిమీ ఓవర్టన్ 4 వికెట్లు తీసుకోగా, మిగిలిన బౌలర్లు తలా ఒక వికెట్ సాధించారు. 16 ఓవర్ పూర్తయ్యే సరికి డీసీ 154 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. స్టబ్స్ 38 బాల్స్ ఎదుర్కొని ఢిల్లీ జట్టులో అత్యధికంగా 60 పరుగులు సాధించారు. ఈ స్కోరులో 4 ఫోర్లు 3 సిక్స్ లు ఉన్నాయి. స్టబ్స్ ఔట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది. 20 ఓవర్లలో డీసీ 189 పరుగులకు అలౌట్ అయింది. దీంతో 23 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం దక్కించుకోవడంతో పాటు ఈ సీజన్లో తొలి విజయాన్నిCSK నమోదు చేసుకుంది.









Leave a Reply