(మెదక్,న్యూస్ఇన్)

సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ విస్తరణ పనులు వేగవంతం అవుతున్నాయి. రూ.13 కోట్లతో చేపడుతున్న ఈ బైపాస్ రోడ్ లో ఐదు చోట్ల జంక్షన్ లు ఏర్పాటు చేయాలని HMDA అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో ఐబి గెస్ట్ హౌస్ మొదలుకుని బసవేశ్వర చౌక్ వరకు ఐదు చోట్ల జంక్షన్ లు ఏర్పాట చేసేందుకు హెచ్ ఏం డీఏ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
HMDA అధికారులతో కలిసి జంక్షన్ లు ఏర్పాటయ్యే ఐబి చౌరస్తా ఆర్డీవో క్యాంప్ ఆఫీస్ చౌరస్తాలను జగ్గారెడ్డి పరిశీలించారు. ఈ జంక్షన్ లలో సుందరీకరణ పనులు చేయాలని, జంక్షన్ లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని HMDA అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచెలా జంక్షన్ ల డిజైన్ లు ఉండాలని కన్సల్టెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. జంక్షన్ లు ఏర్పాటు విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చూడాలని HMDA అధికారులకు సూచించారు. రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి కావాలని అధికారులకు జగ్గారెడ్డి తెలిపారు.










Leave a Reply