(హైదరాబాద్,న్యూస్ఇన్)
బీఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురై రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న కల్వకుంట్ల కవిత గురించి కేటిఆర్ తొలి సారి స్పందించారు. కవిత విషయంలో చెప్పేదేమి లేదన్నారు. ఆమె రాజకీయ జీవితాన్ని ఆమె చూసుకుంటున్నారని పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ…. సెంటిమెంట్ తో కవిత ను నోరుమూయించే లా కేటిఆర్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది కాలంగా కవిత గులాబీ పార్టీని సీరియస్ గా టార్గెట్ చేస్తున్నా…..ఇప్పటి వరకు కవిత గురించి ఎప్పుడూ పార్టీ నేతలు పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వం పై పోరాటంలా కాకుండా ప్రతిపక్ష పార్టీపై ఇరుకున పెట్టే విధంగా కవిత వ్యవమరిస్తుందని గులాబీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నా…అధికారికంగా స్పందించలేదు. కానీ తొలిసారి కేటిఆర కవితను ఇరుకున పెట్టేలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నెల 25వ తేదీన రాజకీయ పార్టీని ప్రకటించేందుకు కవిత సిద్ధం అవుతున్న నేపథ్యంలో కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, సెంటిమెంట్ పరంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కవిత గురించి నేరుగా స్పందించకపోయినా…..కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కవిత కుటుంబ సభ్యులను సంతోష పెట్టకపోయినా….ఏడిపించకపోతే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలు ఉంటాయ్…పోతాయ్ కాని కుటుంబ సభ్యులనుత తన చర్యలతో బాధ పెట్టే తీరు ఎవరికీ మంచిది కాదని హితవు చెప్పారు. రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు…ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. కానీ రాజకీయ పార్టీకి ప్రజల ఆదరణ ముఖ్యమన్నారు.










Leave a Reply