NewsInn

News in a Click

రాష్ట్రంలో మ‌రో నాలుగు రోజులు భ‌గభ‌గలే

రాష్ట్రంలో మ‌రో నాలుగు రోజులు భ‌గభ‌గలే

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణాలో మ‌రో నాలుగు రోజులు ఎండ‌లు మండ నున్నాయి. 15 వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలో ఊష్ణోగ్ర‌తలు 44 డిగ్రీల వ‌ర‌కు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిస్తోంది.ఈ రోజు కూడా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ‌గానే ఊష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. దాదాపు వారం రోజుల పాటు ఇదే ప‌రిస్తితి ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ముంద‌స్తుగానే అప్ర‌మ‌త్తం చేసింది. ఏపీలో కూడా దాదాపు ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఏప్రిల్ నెల మ‌ధ్య‌లోనే 45 డిగ్రీల ఊష్ణోగ్ర‌త ఏపీలోని ఒంటిమిట్ట‌లో న‌మోదైంది. దక్షిణ అస్సాం నుండి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న‌ ఉత్తర-దక్షిణ ద్రోణి ఈరోజు ఆగ్నేయ మధ్య ప్రదేశ్ నుండి విదర్భ, మరఠ్వాడ‌, ఉత్తర అంతర్గత కర్నాటక ప్రాంతంలో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.

మూడు రోజులు పొడి వాతావరణం….

రానున్న మూడు రోజుల లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు వడ గాల్పులు కూడా వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. చిన్నారులు, వృద్ధులు త‌గు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *