NewsInn

News in a Click

కాంగ్రెస్ లో వ‌ల‌స‌ల ఎఫెక్ట్- రంగంలోకి మీనాక్షి

కాంగ్రెస్ లో వ‌ల‌స‌ల ఎఫెక్ట్- రంగంలోకి మీనాక్షి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయ పార్టీల నుంచి వ‌ల‌స‌లు స‌హ‌జం. ఇచ్చిన హామీలు అమ‌లు కాక‌పోవ‌డం, భ‌విష్య‌త్తుపై భ‌రోసా క‌ల్పించ‌క‌పోవ‌డం వంటి అంశాల‌తో అన్ని రాజ‌కీయ పార్టీల నుంచి వ‌ల‌స‌లు నిరంత‌రం జ‌రిగే ప్ర‌క్రియ కాని…తెలంగాణాలో ప్ర‌స్తుతం భిన్నంగా ప‌రిస్థితి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి దాదాపు రెండున్న‌రేళ్లు అవుతోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు మాత్ర‌మే పూర్త‌య్యాయి. ప్రారంభంలో ప‌లువురు నేత‌ల‌కు కార్పోరేష‌న్ ప‌దవులు వ‌రించాయి.ఆ త‌రువాత పార్టీ సంస్థాగ‌త నిర్మాణం కానీ, నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ కానీ పూర్తి కాలేదు. ఈ ప‌రిస్థితుల్లో ప‌లువురు నేత‌లు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి స‌హా ఆయ‌న అనుచ‌రులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ ఎస్ చేరేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. దీంతో జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోల్పోరాద‌న్న అభిప్రాయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా రంగంలోకి ఆ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ జీవితాన్ని అనుభ‌వించిన జీవ‌న్ రెడ్డి లాంటి నేత పార్టీకి గుడ్ బై చెప్ప‌డం పార్టీ క్యాడ‌ర్ లో అసంతృప్తిని ర‌గిలిస్తోంద‌ని కాంగ్రెస్ పెద్ద‌లు అంచనాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డితేనే వ‌ల‌స‌ల‌ను నివారించే అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీ పెద్ద‌లు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ కు సూచ‌న‌లు చేసిన‌ట్లు స‌మాచారం.

నేత‌ల‌కు ప‌దవులు…….

దీంతో రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ తో క‌లిసి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్ లు సుదీర్గంగా చ‌ర్చించారు. దాదాపు ఐదు గంట‌ల పాటు వీరు భేటీ అయి పార్టీని సంస్థా గ‌తంగా బ‌లోపేతం చేసేందుకు అనుగుణంగా అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వంలో ఇంకా నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ విష‌యంలో జాప్యం జ‌రుగుతుండ‌డంతో…దానికి పులిస్టాప్ పెట్టాల‌న్న నిర్ణ‌యానికి ఈ ముగ్గురు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. నేత‌ల‌కు వివిధ ఫెడ‌రేష‌న్ల చైర్మ‌న్ ప‌ద‌వులు మ‌రో రెండు,మూడు రోజుల్లోనే క‌ట్ట‌బెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటు పార్టీ ప‌ద‌వుల‌ను కూడా వీలైనంత త్వ‌ర‌లో భ‌ర్తీ చేయాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్య‌ద‌ర్శ‌లతో పాటు ఇత‌ర సంస్థాగ‌త ప‌ద‌వుల‌ను కూడా భ‌ర్తీ చేయాల‌ని పార్టీ భావిస్తోంది. దీంతో పాటు మండ‌ల క‌మిటీల నియామ‌కం, బీఎల్ ఓ ల‌పై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

డీలిమిటేష‌న్ పై….

జాతీయ స్థాయిలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్న డీలిమిషటేష‌న్ వ్య‌వ‌హారం వివాదాస్ప‌దంగా మారుతోంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై చిన్న రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. చిన్న రాష్ట్రాల‌కు న్యాయం జ‌రిగేలా కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాటానికి సిద్దం కావావ‌లన్న యోచ‌న‌లో సీఏం ఉన్నారు. దీంతో పాటు ద‌క్షిణాది రాష్ట్రాల‌న ఏకం చేసే ప‌నిలో సీఎం ఉన్నారు. దీన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని క్షేత్ర స్థాయిలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. మ‌హిళాబిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్నట్లు ప్ర‌క‌టించినా…. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న పై విస్త్రుత చ‌ర్చ జ‌రగాల‌ని,చిన్న రాష్ట్రాల‌కు అన్యాయం చేసేలా కేంద్ర కుట్ర తో వ్య‌వ‌హ‌రిస్తోందన్న విమ‌ర్శ‌లు రేవంత్ రెడ్డిచేస్తున్నారు. ఈ అంశంపై క్షేత్ర స్థాయిలో నిర‌స‌న‌లు తెలిపే అంశంపైకూడా క‌స‌ర‌త్తు చేసిన‌ట్లు తెలుస్తోంది. ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు చిన్న రాష్ట్రాల‌కు న్యాయం చేయాల‌ని వాద‌న‌ను బ‌లంగా వినిపించేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. పున‌ర్విభ‌జ‌న‌పై సీఎం ఏమాన్నారంటే….. అవ‌స‌ర‌మైతే జాతీయ స్థాయిలో కూడా ఆందోళ‌న నిర్వ‌హించి బీజేపీకి ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టాల‌న్న యోచ‌న‌లో కాంగ్రెస్ ఉన్న‌ట్లు స‌మ‌చారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *